ETV Bharat / state

హంద్రీనీవాకు నీళ్లు ఇవ్వండి మహాప్రభో..!

author img

By

Published : Aug 31, 2019, 3:30 PM IST

రాష్ట్రంలో వరద నీరు పోటెత్తుతుంటే, చిత్తూరు జిల్లాలో మాత్రం దుర్బిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుక్కెడు తాగు నీటి కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోంది.

హంద్రినీవాకై పడిగాపులు
హంద్రినీవాకై పడిగాపులు

చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న తంబళ్లపల్లె, మదనపల్లి,వాల్మీకిపురం, పుంగనూరు, పలమనేరు మండలాల్లో నీటి జాడ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరద నీటితో కళకళలాడుతున్న నదులతో సుభిక్షంగా ఉంటే... ఇక్కడ మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.
గత ప్రభుత్వం ఇక్కడి ఇబ్బందులు గమనించి... తంబళ్లపల్లె వద్ద నుంచి కుప్పం వరకూ హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాలు పారేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఎన్నికలు రావడంతో కాలువ పనులు పర్యావేక్షించే వారు కరువయ్యారు. దీంతో పనులు ఆగిపోయి.. నీటి కష్టాలు మెుదలయ్యాయి.
కరెంటు, నీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే వలసే శరణ్యం అంటున్న గ్రామస్తుల గోడు... వినటానికి ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే పశు పోషణ కష్టమై పాడికి దూరమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందనీ, హంద్రీనీవా కాలువ నీరు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని వృద్ధ రైతులు చెప్తున్నారు.
తంబళ్లపల్లి కోటకొండ వద్ద ఏర్పాటు చేసిన ఏడవ పంపు హౌస్​లోకి హంద్రీనీవా కాలువ నీరు ప్రవహించడానికి ఉన్న అడ్డులు తొలగిస్తే ఈ మండలాలు జల సిరితో కళకళలాడుతాయనీ ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 'తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత'

హంద్రినీవాకై పడిగాపులు

చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న తంబళ్లపల్లె, మదనపల్లి,వాల్మీకిపురం, పుంగనూరు, పలమనేరు మండలాల్లో నీటి జాడ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరద నీటితో కళకళలాడుతున్న నదులతో సుభిక్షంగా ఉంటే... ఇక్కడ మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.
గత ప్రభుత్వం ఇక్కడి ఇబ్బందులు గమనించి... తంబళ్లపల్లె వద్ద నుంచి కుప్పం వరకూ హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాలు పారేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఎన్నికలు రావడంతో కాలువ పనులు పర్యావేక్షించే వారు కరువయ్యారు. దీంతో పనులు ఆగిపోయి.. నీటి కష్టాలు మెుదలయ్యాయి.
కరెంటు, నీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే వలసే శరణ్యం అంటున్న గ్రామస్తుల గోడు... వినటానికి ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే పశు పోషణ కష్టమై పాడికి దూరమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందనీ, హంద్రీనీవా కాలువ నీరు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని వృద్ధ రైతులు చెప్తున్నారు.
తంబళ్లపల్లి కోటకొండ వద్ద ఏర్పాటు చేసిన ఏడవ పంపు హౌస్​లోకి హంద్రీనీవా కాలువ నీరు ప్రవహించడానికి ఉన్న అడ్డులు తొలగిస్తే ఈ మండలాలు జల సిరితో కళకళలాడుతాయనీ ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 'తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత'

Intro:ap_vzm_36_31_colany_loki_varadaneeru_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 వరహాల గడ్డలో ప్రవాహం పెరగడంతో వరద నీరు కాలనీలో కి చేరింది


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ మధ్యలోంచి ప్రవహించే వరహాలు గడ్డలో ప్రవాహం ఎక్కువయింది శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరహాలు గడ్డ పొంగింది బైపాస్ కాలనీలో కాలువల నీరు బయటికి పోయే మార్గం సరిగా లేక గడ్డ నీరు కాలనీలో కి చేరింది బైపాస్ కాలనీ కాలువల్లోకి గడ్డ నీరు చేరడంతో వీధుల్లో కి నీరు చేరడంతో రాకపోకలకు కొద్ది సమయం ఇబ్బంది ఎదురైంది కాలనీలోని రెండు వీధుల్లో లో ఎక్కడ నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు పురపాలక కమిషనర్ ప్రసాదరావు పరిస్థితిని పరిశీలించారు నీరు పోయే చర్యలు చేపట్టడంతో కాలనీ లో కి చేరిన నీరు తగ్గు ముఖం పట్టింది కాలిలోని వసతి గృహం చుట్టూ వరద నీరు చేరింది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు


Conclusion:బైపాస్ కాలనీ లో కి చేరిన గడ్డం మీరు కాల్వ నిండి రోడ్డెక్కిన నీరు రాకపోకలకు ఎదురైన ఇబ్బంది వసతి గ్రహం చుట్టూ చేరిన నీరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.