ETV Bharat / state

కాలువలో యువకుడి మృతదేహం.. హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం - తిరుపతి నేర వార్తలు

తిరుపతిలోని గోపాల్​రాజు కాలనీలోని కాల్వలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The body of a young man in the canal and Police suspect that he was murdered in thirupathi
కాలువలో యువకుడి మృతదేహం.
author img

By

Published : Jun 18, 2020, 6:01 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోపాల్ రాజు కాలనీలోని కాలువలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన కాలనీవాసులు తూర్పు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మృతుడు సాయినగర్ పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్​కు చెందిన విజయ్ గా గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష నినిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోపాల్ రాజు కాలనీలోని కాలువలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన కాలనీవాసులు తూర్పు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మృతుడు సాయినగర్ పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్​కు చెందిన విజయ్ గా గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష నినిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

అమరావతి మలిదశ ఉద్యమంపై ఎంపీ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.