చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు తెదేపా, ముగ్గురు వైకాపా కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
మహిళా సంఘాల్లో సభ్యుల తొలగింపు విషయంలో వివాదం ప్రారంభమైంది. ఇరువర్గాల మధ్య రాత్రి నుంచి వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి.