ETV Bharat / state

'ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'

author img

By

Published : Oct 12, 2020, 4:48 PM IST

అమరావతిని ఆంధ్రుల ఏకైక రాజధానిగా ప్రకటించాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశాయి. 300 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పార్టీ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రదర్శన చేశారు.

tdp protests in chittor district
tdp protests in chittor district

చిత్తూరు జిల్లాలో అమరావతి నినాదం మార్మోగింది. రాజధాని రైతులకు మద్దతుగా జిల్లాలోని తెదేపా శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో తెదేపా నాయకులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలంలో జిల్లా తెదేపా కార్యదర్శి మోహన్ మురళి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్​కు అందజేశారు.

పుత్తూరులో తెదేపా శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా తిరుపతి రూరల్ మండలంలో చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఆర్టీవో కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామవని చెప్పారు.

చిత్తూరు జిల్లాలో అమరావతి నినాదం మార్మోగింది. రాజధాని రైతులకు మద్దతుగా జిల్లాలోని తెదేపా శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో తెదేపా నాయకులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలంలో జిల్లా తెదేపా కార్యదర్శి మోహన్ మురళి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్​కు అందజేశారు.

పుత్తూరులో తెదేపా శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా తిరుపతి రూరల్ మండలంలో చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఆర్టీవో కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామవని చెప్పారు.

ఇదీ చదవండి:

అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.