తమిళనాడు నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా నగరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 125 మద్యం సీసాలు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 18 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :