ETV Bharat / state

తలకోన సోయగాలు.. చూపరులకు ఆనందాలు

గత రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చి.. అందాలను ఆస్వాదిస్తున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 8:53 PM IST

తలకోన సోయగాలు చూద్దము రారండి
తలకోన సోయగాలు చూద్దము రారండి

చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే పుడమి తల్లి పులకించి పచ్చని చెట్లతో తలకోన జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడున్న జలపాతం అందాలను వీక్షించడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాలైన చెన్నై, కర్ణాటక నుంచి కూడా పర్యాటక ప్రేమికులు తరలి వస్తున్నారు. ఇక్కడకు వచ్చిన యువకులు తమ సెల్​ఫోన్లలో తలకోన అందాలను బంధిస్తూ సంబరపడుతున్నారు. తలకోనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిల్లతీగపై పిల్లలు, యువకులు ఊగుతూ కేరింతలు కొడుతున్నారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావటంతో అటవీశాఖ అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు.

తలకోన సోయగాలు చూద్దము రారండి

చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే పుడమి తల్లి పులకించి పచ్చని చెట్లతో తలకోన జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడున్న జలపాతం అందాలను వీక్షించడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాలైన చెన్నై, కర్ణాటక నుంచి కూడా పర్యాటక ప్రేమికులు తరలి వస్తున్నారు. ఇక్కడకు వచ్చిన యువకులు తమ సెల్​ఫోన్లలో తలకోన అందాలను బంధిస్తూ సంబరపడుతున్నారు. తలకోనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిల్లతీగపై పిల్లలు, యువకులు ఊగుతూ కేరింతలు కొడుతున్నారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావటంతో అటవీశాఖ అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు.

ఇదీ చదవండి :

ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ఘనంగా పుష్పయాగం

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణాజిల్లా , అవనిగడ్డ నియోజకవర్గం లోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు , మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో గత నెల రోజులుగా సుమారు 100 మంది వరకు పాము కాటుకు గురయ్యారు వీరిలో లో 7 గురు వరకు మరణించారు.

పాము కాట్ల సమస్యను స్థానిక శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తెలుపగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కృష్ణాజిల్లా కలెక్టర్ కు ఆదేశాలతో ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మరియు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం ఇంతియాజ్ మరియు వ్యవసాయ శాఖ అటవీశాఖ ఆరోగ్యశాఖ అంగన్వాడి ఆశ వర్కర్ల తో అవనిగడ్డలో తాసిల్దార్ కార్యాలయం లో పాముకాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు

పాము కాట్ల పై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ఉన్న VRO, VRA, నర్సు, పంచాయతీ సెక్రెటరీ, వ్యవసాయ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
పాము కాటు జరిగి మరణం సంభవిస్తే సంబంధిత గ్రామ పరిధిలో అధికారుల పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.

స్థానిక యమ్.యల్.ఎ సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ పాముకాటు వలన ఒక్క మరణం కూడా జరగకూడదని తెలిపారు. డాక్టర్లు పాముకాటు బాధితులను వేరే చోటుకి రిఫర్ చేయకుండా వైద్యం అందించాలని కోరారు.

డాక్టర్లు పాముకాటుపై ఏమి చేయాలి ఏమి చేయకూడదో అవగాహన కల్పించారు.
జనవరి 1 నుండి ఇప్పటి వరకు 146 పాము కాటు కేసులు నమోదైనాయి అని తెలిపారు. వీటిలో 7 గురు మరణించారు




Body:అవనిగడ్డలో పాముకాటు పై అవగాహన సదస్సు లో పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్


Conclusion:అవనిగడ్డలో పాముకాటు పై అవగాహన సదస్సు లో పాల్గొన్న కృష్ణా జిల్లా, కలెక్టర్ ఇంతియాజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.