తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కీలకదశకు చేరుకొన్నాయి. కీలకమైన గరుడవాహనసేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. గరుడవాహన సేవ రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల్లో కంటే అదనంగా పదకొండు వందల మంది భద్రతా సిబ్బందిని నియమించామని.... ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పూర్తిగా నిలిపివేశామన ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సర్వదర్శనం కోసం సమయనిర్దేశిత టోకెన్ల జారీని రద్దు చేశామని ఆయన తెలిపారు. నేరుగా తిరుమల గిరులకు చేరుకొనే భక్తులను వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: