తితిదే జెఈవో బసంత్ కూమార్ ఇంట్లో చోరీ జరిగింది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం సమీపంలో బసంత్ కుమార్ నివసిస్తున్నారు. అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులు పగలకొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని 18 సవరాల బంగారం, 5 తులాల వెండి చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'ప్యాకేజీ'తో సామాన్యుడికి ప్రయోజనమెంత?