రాయలసీమ ప్రత్యేక రైలు నిజామాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంది. ఈ రైలులో 530మంది ప్రయాణికులు తిరుపతికి చేరుకోగా... వీరిలో 58 మంది వృద్ధులు, చిన్నారులకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలినవారికి శరీర ఉష్ణోగ్రత తనిఖీలు, హోం క్వారంటైన్ స్టాంపులు లేకుండానే అధికారులు వదిలేశారు. కొవిడ్-19 ప్రోటో కాల్ ప్రకారం ప్రయాణికులు రైలు ఎక్కే స్టేషన్లోనూ...వారి గమ్యస్థానాల్లోనూ థర్మల్ స్క్రీన్ తో శరీర ఉష్ణోగ్రత తనిఖీ నిర్వహించాల్సి ఉంది. దీన్ని అధికారులు పాటించలేదు. పరీక్షలు నిర్వహించకుండానే వారిని ఇళ్లకు తరలించడంపై నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి: