ETV Bharat / state

'అందరూ సంతోషంగా ఉన్నప్పుడే పండుగ' - నారావారిపల్లెలో భువనేశ్వరి

రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం పోరాడుతుంటే.. తాము పండుగ చేసుకోవడం సమంజసం కాదని నారా భువనేశ్వరి అన్నారు. అమరావతి ప్రజలకు మద్దతుగా తాము ఈ సంక్రాంతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

nara bhuvaneswari at naravaaripalle chittor district
నారా భువనేశ్వరి
author img

By

Published : Jan 12, 2020, 2:52 PM IST

నారా భువనేశ్వరి

రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం పోరాడుతుంటే.. తాము పండుగ చేసుకోవడం సమంజసం కాదనీ.. అందరూ బాగున్నప్పుడే జరుపుకుంటామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కులదైవానికి పూజలు చేసేందుకు స్వగ్రామం వచ్చిన ఆమె.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

నారా భువనేశ్వరి

రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం పోరాడుతుంటే.. తాము పండుగ చేసుకోవడం సమంజసం కాదనీ.. అందరూ బాగున్నప్పుడే జరుపుకుంటామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కులదైవానికి పూజలు చేసేందుకు స్వగ్రామం వచ్చిన ఆమె.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఇవీ చదవండి..

రాష్ట్రం ప్రతిష్ఠ పోయినపుడు పెట్టుబడులు ఎలా వస్తాయి..?'

Intro:అమరావతి ఉద్యమం నేపథ్యంలో సంక్రాంతి పండుగకు దూరంగా నారా కుటుంభం.Body:Ap_tpt_36_12_naraavaripallilo_nara_bhuvaneswari_avb_ap10100

ఆంధ్రరాష్ట్రప్రజలు అమరావతికోసం ఆపసోపాలు పడుతుంటే మేము బాగుండాలని పండగ చేసుకోవడం సమంజసం కాదు.ప్రజలు బాగున్నప్పుడే మేము పండగ చేసుకొంటామని నారా భువనేశ్వరి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి........అప్పుడు రాష్ట్రరాజదానికోసం రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు, వారికి అండగా ఉండాలిసిన బాధ్యత మనందరిదీ.అమరావతిలో
మహిళలు,రైతులు చేసే ఉద్యమానికి హ్యట్సప్.పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని రైతులు భూములు ఇచ్చారని......కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టి వెదుకాచుస్తుందని దుయ్యబట్టారు. లాభాల కోసం,కుటుంబ అభివృద్ధి కోసం ఆశతో భూములు ఇచ్చారు.పెట్టుబడులు పెట్టేది ఎవరైనా లాభాల కోసమే.నమ్మకంతో ఇచ్చిన భూములు హక్కు కోసం మహిళలు,రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.రైతులు బాధల్లో ఉంటే సంక్రాంతి పండుగ సంబరాలకు చేసుకునేందుకు మనసు అంగీకరించలేదు.
కుటుంబ సభ్యులు అందరూ కలసి సంక్రాంతి పండుగ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాము.సంక్రాంతి ముందు కుల దేవతకు పూజలు చేయడం ఆనవాయితీ.
రైతన్నలకు,మహిళలకు అండగా ఉండేందుకు పండుగ చేసుకోవడం లేదుఅని ఆమెతెలిపారు.
అక్కడకు వచ్చిన కారులలో ఒకదానికి పదవులు స్యాస్వతం కాదు ప్రజల అభిమానమే శాస్వితం" సేవ్ అమరావతి " అని ఉండడాన్ని అక్కడవున్నవారు ఆసక్తిగా చూసారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.