ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గత 20 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తోందని సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో తెదేపా ప్రభుత్వం మాదిగలను విస్మరించడమే ఆ పార్టీ ఓటమికి కారణమని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో నాలుగు లోక్సభ స్థానాలను ఎస్సీలకు కేటాయించాలని కోరినా తెదేపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈడుముడిలో ఎమ్మార్పీఎస్ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జూన్ 5 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ నాయకులు పాదయాత్రలు చేపడతారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : చల్లని ఐడియా.. ఎండ నుంచి ఇలా తప్పించుకోండి!