రాష్ట్రంలో రాజకీయాలు సమరాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు.
ఈ క్రమంలో కోతకు గురవుతున్న రాయల చెరువుకు సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు.. అక్కడే ఉన్న వైకాపా నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి(Chandragiri MLA chevireddy Bhasker Reddy) నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీచదవండి.