చిత్తూరు జిల్లా తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో మెట్లోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అలిపిరి పాదాల మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి, దాససాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనందతీర్ధాచార్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల్లో భక్తిభావం పెంచడానికి మెట్లోత్సవ వేడుకలు ఉపకరిస్తాయని మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి తెలిపారు. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: