ETV Bharat / state

మైమరిపించే అందాలు... కల్యాణి జలాశయం సొంతం

author img

By

Published : Dec 8, 2020, 6:48 AM IST

చుట్టూ పచ్చదనం, మైమరిపించే శేషాచలం అందాలు...కొండల మధ్యన జలాశయం పరవళ్లు...ఇదీ కల్యాణి డ్యాం ప్రత్యేకత. తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చే కళ్యాణి డ్యాం.....ఇటీవల వర్షాలకు నిండుకుండలా మారింది. గరిష్ఠ నీటిమట్టాన్ని చేరుకోవడంతో అధికారులు ఓ గేటును ఎత్తిని నీటిని విడుదల చేశారు. ఆ కనువిందైన దృశ్యాలను చూసేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

మైమరిపించే అందాలు... కల్యాణి జలాశయం సొంతం
మైమరిపించే అందాలు... కల్యాణి జలాశయం సొంతం

తిరుమలకు భక్తులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 1977లో...చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సమీపంలో కల్యాణి డ్యాం నిర్మించారు. 12వేల ఎకరాల విస్తీర్ణంలో 900 అడుగుల నీటిమట్టంతో 31 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించారు. 1600 అడుగుల పొడవుతో మూడు స్పిల్‌ వే గేట్లు ఏర్పాటు చేశారు.

మైమరిపించే అందాలు... కల్యాణి జలాశయం సొంతం

దిగువకు నీటి విడుదల చేసే సమయంలో ఆ దృశ్యాలను కన్నులవిందుగా ఉంటాయి. నివర్‌ తుపాను సహా ఇటీవల భారీ వర్షాలకు జలాశయం నిండడంతో... ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూసేందుకు వచ్చిన సందర్శకుల.........ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు...

కల్యాణి డ్యాంకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. జలాశయం వంతెనపై గుంతలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల గోడలు పెచ్చులూడి దర్శనమిస్తున్నాయి. స్పిల్ వే గేట్ల నుంచి లీకేజీలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని.....తక్షణ మరమ్మతుల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరామని....అధికారులు చెబుతున్నారు. జలాశయం ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

'తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో సమన్వయంతో పనిచేయాలి'

తిరుమలకు భక్తులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 1977లో...చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సమీపంలో కల్యాణి డ్యాం నిర్మించారు. 12వేల ఎకరాల విస్తీర్ణంలో 900 అడుగుల నీటిమట్టంతో 31 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించారు. 1600 అడుగుల పొడవుతో మూడు స్పిల్‌ వే గేట్లు ఏర్పాటు చేశారు.

మైమరిపించే అందాలు... కల్యాణి జలాశయం సొంతం

దిగువకు నీటి విడుదల చేసే సమయంలో ఆ దృశ్యాలను కన్నులవిందుగా ఉంటాయి. నివర్‌ తుపాను సహా ఇటీవల భారీ వర్షాలకు జలాశయం నిండడంతో... ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూసేందుకు వచ్చిన సందర్శకుల.........ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు...

కల్యాణి డ్యాంకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. జలాశయం వంతెనపై గుంతలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల గోడలు పెచ్చులూడి దర్శనమిస్తున్నాయి. స్పిల్ వే గేట్ల నుంచి లీకేజీలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని.....తక్షణ మరమ్మతుల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరామని....అధికారులు చెబుతున్నారు. జలాశయం ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

'తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో సమన్వయంతో పనిచేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.