తిరుపతికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివశంకర్ శ్రీ సిటీ పోలీసులకు చిక్కాడు. తమిళనాడు సరిహద్దుల వద్ద శ్రీ సిటీ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో శివశంకర్, అతని ఇద్దరు అనుచరులు తిరుమల్రెడ్డి, సిరాజ్ బాషా తెల్లవారు జామున 4.30 సమయంలో దొరికిపోయారు. శివశంకర్ అతని అనుచరులతో కలిసి స్కార్పియోలో వెళ్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. చెన్నైవైపుగా అనుమానాస్పదంగా వెళ్తున్న స్కార్పియోను పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా డ్రైవర్ ఆపలేదు. వెంటనే అధికారులు ఆ వాహనాన్ని వెంబడించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే శివశంకర్పై 64 పెండింగ్ కేసులు ఉన్నాయనీ, అతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య