ETV Bharat / state

గంజాయి మత్తులో దాడి.. ఆరుగురిపై కేసు

author img

By

Published : May 31, 2020, 11:06 PM IST

తిరుపతిలో యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. దారిన పోయిన యువకుడిపై.. గంజాయి సేవించిన ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Cannabis Use in tirupati
గంజాయి మత్తులో యువకుడిపై దాడి

తిరుపతిలో యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. నగరంలోని తాతయ్యగుంటలో గంజాయి సేవించిన యువకులు.. దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేయడం వల్ల వెంకటసాయి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరు మంది యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. నగరంలోని తాతయ్యగుంటలో గంజాయి సేవించిన యువకులు.. దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేయడం వల్ల వెంకటసాయి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరు మంది యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి:

వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.