తిరుపతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను....రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి...విక్రయించటం ద్వారా ప్రభుత్వం బాధితుల కష్టాలను దూరం చేయాలని... ఆయన కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ మోసాలకు కారణమైన వారంతా బినామీ పేర్లతో తమ ఆస్తులను అమ్ముకుంటున్నారన్న ఆయన ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20వేల రూపాయల లోపు ఉన్న 13లక్షల మంది బాధితులకు సంబంధించి 1150 కోట్ల రూపాయలను విడుదల చేసి బాధితులను సత్వరమే ఆదుకోవాలని అన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను సత్వరమే ఆదుకోవాలి
అగ్రిగోల్డ్ బాధితుల కోసం తిరుపతి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫెర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితలను కాపాడాలని అసోసియేషన్ వారు డిమాండ్ చేశారు.
తిరుపతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను....రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి...విక్రయించటం ద్వారా ప్రభుత్వం బాధితుల కష్టాలను దూరం చేయాలని... ఆయన కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ మోసాలకు కారణమైన వారంతా బినామీ పేర్లతో తమ ఆస్తులను అమ్ముకుంటున్నారన్న ఆయన ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20వేల రూపాయల లోపు ఉన్న 13లక్షల మంది బాధితులకు సంబంధించి 1150 కోట్ల రూపాయలను విడుదల చేసి బాధితులను సత్వరమే ఆదుకోవాలని అన్నారు.
Contributor : k. vara prasad(prathipadu),guntur
8008622422
Anchor : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా వాలంటీర్ల వ్యవస్థతో తొలి అడుగు ప్రభుత్వం వేసిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను ఆమె అందజేసి మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసే సమయంలో ప్రజల కష్టాలను గమనించారని...ప్రతి ఇంటికి సంక్షేమ పధకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్లను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు అర్హులైన వారికి పధకాలను అందించలేదన్నారు. అక్టోబర్ 2నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు అనుసంధాన కర్తలుగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 50 వేలు ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు తెలిపారు. మహిళకు సమాన ప్రాతినిధ్యం తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అందరూ కలిసి కట్టుగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు.
Body:end
Conclusion:end