ETV Bharat / state

భారీగా చౌక బియ్యం పట్టివేత.. నలుగురు అరెస్ట్ - illegal transport of rice seazed at chittor

కడప జిల్లా నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీల్లో తరలిస్తున్న వెయ్యి బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మదనపల్లి డీఎస్పీ మనోహర్ ఆచారి తెలిపారు.

rice seazed
rice seazed
author img

By

Published : May 10, 2021, 7:01 PM IST

కడప జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి రెండు లారీల్లో.. వెయ్యి బస్తాల బియ్యాన్ని బెంగళూరుకు తరలిస్తుండగా.. మదనపల్లి టూ టౌన్ పోలీసులు పట్టణ శివారు ప్రాంతం వద్ద కాపు కాసి పట్టుకున్నారు.

బియ్యం బస్తాలకు సివిల్ సప్లై పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు మదనపల్లి డీఎస్పి మనోహర్ ఆచారి తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కడప జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి రెండు లారీల్లో.. వెయ్యి బస్తాల బియ్యాన్ని బెంగళూరుకు తరలిస్తుండగా.. మదనపల్లి టూ టౌన్ పోలీసులు పట్టణ శివారు ప్రాంతం వద్ద కాపు కాసి పట్టుకున్నారు.

బియ్యం బస్తాలకు సివిల్ సప్లై పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు మదనపల్లి డీఎస్పి మనోహర్ ఆచారి తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

ఓటుకు నోటు కేసులో క్రాస్ ఎగ్జామినేషన్​కు చివరి అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.