ETV Bharat / state

PROTEST : పోటాపోటీగా విగ్రహాల ఏర్పాటు.. రామకుప్పంలో ఉద్రిక్తత!

author img

By

Published : Jan 2, 2022, 6:27 PM IST

చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

విగ్రహ ఏర్పాటు విషయంలో ఘర్షణ
విగ్రహ ఏర్పాటు విషయంలో ఘర్షణ

చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలోని శివాజీనగర్​లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని వివాదాస్పద స్థలంలో దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఇవాళ అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రెడ్డి సామాజిక వర్గీయులు ఏర్పాట్లు చేపట్టారు.

సమచారం అందుకున్న దళితులు.. ఘటనాస్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలోని శివాజీనగర్​లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని వివాదాస్పద స్థలంలో దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఇవాళ అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రెడ్డి సామాజిక వర్గీయులు ఏర్పాట్లు చేపట్టారు.

సమచారం అందుకున్న దళితులు.. ఘటనాస్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

ఇదీచదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.