ETV Bharat / state

విత్తన పంపిణీపై అన్నదాతకు నిరాశే - విత్తన పంపిణీ తాజా వార్తలు

వేరుసెనగ పంట సాగుచేసే రైతులకు ఆరంభంలోనే నిరాశే ఎదురైంది. ఒకరికి ఒక బస్తానే ఇవ్వడంతో ఆవేదన చెందుతున్నారు. కొన్నిచోట్ల బూజుపట్టిన విత్తన కాయలు సరఫరా చేశారు. కొందరు విత్తనాలు అవసరం లేదంటూ తిరిగి ఇచ్చేస్తున్నారు. 

seeds distribution to farmer
seeds distribution to farmer
author img

By

Published : May 18, 2021, 9:19 PM IST

చిత్తూరు జిల్లాలో రాయితీ వేరుసెనగ విత్తనం పంపిణీ సోమవారం ప్రారంభమైంది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందజేశారు. 19 మండలాల పరిధిలోని 185 ఆర్‌బీకేల ద్వారా పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో తొలిరోజు 14,500 మంది రైతులకు 6,535 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతుకు ఒక బస్తా మాత్రమే అందజేశారు. బస్తాతో ఎలా విత్తు వేసేదంటూ నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో వర్షాధారంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుసెనగ సాగవుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంత రైతులు విస్తారంగా సాగుచేస్తారు. గతంలో ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణం అనుగుణంగా బస్తా నుంచి 3-4 బస్తాల విత్తనం అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల వారీగా నిర్ణీత సంఖ్యలోనే విత్తు అందజేయాలని నిర్ణయించి సరఫరా చేస్తోంది. ఒక బస్తాకే నమోదు చేసి.. నగదు చెల్లించుకున్నారు. బస్తా విత్తనాలతో ఎలా సాగుచేసేదని రైతులు అధికారులను ఆడిగినా..వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సాగు భూమి విస్తీర్ణం అనుగుణంగా ప్రతి ఒక్కరికీ 2-3 బస్తాలు అందజేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

వచ్చింది తక్కువ.. అవీ నాసిరకం

సోమవారం పలమనేరు మండలంలోని పెంగరగుంట, పిఒడ్డూరులో ఇచ్చిన కాయలు బూజు పట్టాయి. పెంగరగుంట గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన విత్తన కాయలను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుకు 30 కిలోలు

ప్రభుత్వం ఒకరికి 30 కిలోల విత్తనాలను సరఫరా చేస్తోంది. అవి ఎకరా పొలంలో సగానికి కూడా సరిపోవని రైతులు అంటున్నారు. మిగిలిన భూమిలో విత్తనాలు చల్లడానికి ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిందే. ప్రస్తుతం ప్రైవేటులో 30 కిలోల బస్తా రూ.2000 ధర పలుకుతోంది. ప్రభుత్వం రాయితీ పోను బస్తా రూ.1563 చొప్పున విక్రయిస్తోంది. కేవలం రూ.437 తేడా ఉండటంతో రైతులు ప్రభుత్వ విత్తనాల కోసం పోటీ పడటం లేదు.
కొన్ని బస్తాలలో వేరుసెనగ కాయలు చెడిపోయి ఉన్నమాట వాస్తవమేనని అందుకే అక్కడ సరఫరా ఆపేశామని పలమనేరు వ్యవసాయ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.

అరకొరగా కేటాయింపులు

అరకొర విత్తన కేటాయింపులతో సమస్య తలెత్తింది. ప్రభుత్వం జిల్లాకు 76వేల క్వింటాళ్ల విత్తనాన్ని కేటాయించింది. అరకొరగా ఆర్‌బీకేల్లో నిల్వచేసి పంపిణీని ప్రారంభించారు.రైతుకు గరిష్ఠంగా వ΄డు బస్తాలు ఇస్తామని.. అర ఎకరా విస్తీర్ణానికి ఒక బస్తా, ఎకరాకు 2 బస్తాలు, ఒకటిన్నర ఎకరా నుంచి ఆపై విస్తీర్ణం ఉన్నా వ΄డు బస్తాలు అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. తీరా పంపిణీలో ఒకే బస్తా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణం సాగుకు కనీసం 60 కిలోల విత్తనం అవసరం..ఈ లెక్కన వ΄డు బస్తాల విత్తన కాయలు అవసరమవుతాయి. ఉన్నతాధికారులు స్పందించి విస్తీర్ణం ప్రకారం 2-3 బస్తాల విత్తనాన్ని అందజేయాలని రైతులు కోరుతున్నారు.

అందరికీ చేరాలనే ఉద్దేశంతో..

రాయితీ విత్తనం అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాన్ని అందించాలనే సంకల్పంలోనే జిల్లాలోనే విత్తనాన్ని సేకరించాం. కొన్ని ప్రాంతాల్లో రెండు బస్తాలు ఇస్తున్నాం.. స్థానిక పరిస్థితుల అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ప్రకారం 1నుంచి 2 బస్తాలు అందజేయాలని అధికారులకు సూచించాం. అదనంగా జిల్లాకు విత్తన కేటాయింపునకు చర్యలు చేపట్టాం. - దొరసాని, జేడీ, వ్యవసాయ శాఖ

ఇదీ చదవండి: ఏకాంతంగానే.. సత్యదేవుణి వార్షిక కల్యాణం

చిత్తూరు జిల్లాలో రాయితీ వేరుసెనగ విత్తనం పంపిణీ సోమవారం ప్రారంభమైంది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందజేశారు. 19 మండలాల పరిధిలోని 185 ఆర్‌బీకేల ద్వారా పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో తొలిరోజు 14,500 మంది రైతులకు 6,535 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతుకు ఒక బస్తా మాత్రమే అందజేశారు. బస్తాతో ఎలా విత్తు వేసేదంటూ నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో వర్షాధారంగా 1.13 లక్షల హెక్టార్లలో వేరుసెనగ సాగవుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంత రైతులు విస్తారంగా సాగుచేస్తారు. గతంలో ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణం అనుగుణంగా బస్తా నుంచి 3-4 బస్తాల విత్తనం అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల వారీగా నిర్ణీత సంఖ్యలోనే విత్తు అందజేయాలని నిర్ణయించి సరఫరా చేస్తోంది. ఒక బస్తాకే నమోదు చేసి.. నగదు చెల్లించుకున్నారు. బస్తా విత్తనాలతో ఎలా సాగుచేసేదని రైతులు అధికారులను ఆడిగినా..వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సాగు భూమి విస్తీర్ణం అనుగుణంగా ప్రతి ఒక్కరికీ 2-3 బస్తాలు అందజేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

వచ్చింది తక్కువ.. అవీ నాసిరకం

సోమవారం పలమనేరు మండలంలోని పెంగరగుంట, పిఒడ్డూరులో ఇచ్చిన కాయలు బూజు పట్టాయి. పెంగరగుంట గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన విత్తన కాయలను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుకు 30 కిలోలు

ప్రభుత్వం ఒకరికి 30 కిలోల విత్తనాలను సరఫరా చేస్తోంది. అవి ఎకరా పొలంలో సగానికి కూడా సరిపోవని రైతులు అంటున్నారు. మిగిలిన భూమిలో విత్తనాలు చల్లడానికి ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిందే. ప్రస్తుతం ప్రైవేటులో 30 కిలోల బస్తా రూ.2000 ధర పలుకుతోంది. ప్రభుత్వం రాయితీ పోను బస్తా రూ.1563 చొప్పున విక్రయిస్తోంది. కేవలం రూ.437 తేడా ఉండటంతో రైతులు ప్రభుత్వ విత్తనాల కోసం పోటీ పడటం లేదు.
కొన్ని బస్తాలలో వేరుసెనగ కాయలు చెడిపోయి ఉన్నమాట వాస్తవమేనని అందుకే అక్కడ సరఫరా ఆపేశామని పలమనేరు వ్యవసాయ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు.

అరకొరగా కేటాయింపులు

అరకొర విత్తన కేటాయింపులతో సమస్య తలెత్తింది. ప్రభుత్వం జిల్లాకు 76వేల క్వింటాళ్ల విత్తనాన్ని కేటాయించింది. అరకొరగా ఆర్‌బీకేల్లో నిల్వచేసి పంపిణీని ప్రారంభించారు.రైతుకు గరిష్ఠంగా వ΄డు బస్తాలు ఇస్తామని.. అర ఎకరా విస్తీర్ణానికి ఒక బస్తా, ఎకరాకు 2 బస్తాలు, ఒకటిన్నర ఎకరా నుంచి ఆపై విస్తీర్ణం ఉన్నా వ΄డు బస్తాలు అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. తీరా పంపిణీలో ఒకే బస్తా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణం సాగుకు కనీసం 60 కిలోల విత్తనం అవసరం..ఈ లెక్కన వ΄డు బస్తాల విత్తన కాయలు అవసరమవుతాయి. ఉన్నతాధికారులు స్పందించి విస్తీర్ణం ప్రకారం 2-3 బస్తాల విత్తనాన్ని అందజేయాలని రైతులు కోరుతున్నారు.

అందరికీ చేరాలనే ఉద్దేశంతో..

రాయితీ విత్తనం అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాన్ని అందించాలనే సంకల్పంలోనే జిల్లాలోనే విత్తనాన్ని సేకరించాం. కొన్ని ప్రాంతాల్లో రెండు బస్తాలు ఇస్తున్నాం.. స్థానిక పరిస్థితుల అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ప్రకారం 1నుంచి 2 బస్తాలు అందజేయాలని అధికారులకు సూచించాం. అదనంగా జిల్లాకు విత్తన కేటాయింపునకు చర్యలు చేపట్టాం. - దొరసాని, జేడీ, వ్యవసాయ శాఖ

ఇదీ చదవండి: ఏకాంతంగానే.. సత్యదేవుణి వార్షిక కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.