ETV Bharat / state

'వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

author img

By

Published : May 31, 2020, 2:23 PM IST

సుదీర్ఘ లాక్​డౌన్ తర్వాత తిరిగి సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నద్ధం అవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తిరుపతి రైల్వే స్టేషన్​లో ప్రత్యేక రైలును నడిపేందుకు తిరుపతి రైల్వే అధికారులు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో...కొవిడ్ ప్రోటోకాల్​ను పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్​లో ప్రవేశించే దగ్గర నుంచి రైలు ఎక్కేవరకూ......వివిధ దశల్లో ప్రయాణికుడు కొవిడ్ -19 జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్​లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏర్పాట్లపై తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ నాగరమణశర్మతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

etv bharat interview wih tirupathi railway station director
తిరుపతి రైల్వే స్టేషన్ డైరక్టర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి
తిరుపతి రైల్వే స్టేషన్ డైరక్టర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • రేపటి నుంచి ఎటువంటి సర్వీసులు ప్రారంభం కానున్నాయి?

జూన్ 1 నుంచి తిరుపతి నుంచి నిజామాబాద్​కు వెళ్లే రాయలసీమ ఎక్స్​ప్రెస్ ప్రారంభించనున్నాం. గతంలో ఉన్న టైమింగ్ ఆధారంగానే ట్రైన్​ను నడపనున్నాం. దీనికోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్​లో కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే అనుమతిస్తాము. వెయిటింగ్ లిస్ట్​లో ఉన్నా అనుమతించం. ప్రయాణికులను రైళ్లల్లోకి అనుమతించే ముందు శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. ప్రయాణికుల్లో ఎవరికైనా అధిక ఉష్ణోగ్రత ఉంటే వారిని కంపార్టుమెంటులోకి అనుమతించం. ఆరోగ్యసేతు యాప్​ను డౌన్​లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తాం. రైల్వే స్టేషన్​లో ప్యాకెడ్ ఫుడ్ దొరకదు. ప్రయాణికులు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలి.

  • రైల్వే ఉద్యోగులకు ఉన్న నిబంధనలు ఏమిటి?

ప్రతి ఒక్క ఉద్యోగికి మాస్క్ తప్పనిసరి. తరచుగా శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగులందరికీ మాస్కులు, గ్లౌజులు అందజేశాం.

  • స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లల్లో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?

ప్రస్తుతం ఇక్కడు వచ్చేది ఒక్కటే ట్రైన్ అది కేరళ ఎక్స్​ప్రెస్. కానీ దాని గురించి ఎటువంటి టైమింగ్స్ రాలేదు.

ఇదీ చదవండి: వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

తిరుపతి రైల్వే స్టేషన్ డైరక్టర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • రేపటి నుంచి ఎటువంటి సర్వీసులు ప్రారంభం కానున్నాయి?

జూన్ 1 నుంచి తిరుపతి నుంచి నిజామాబాద్​కు వెళ్లే రాయలసీమ ఎక్స్​ప్రెస్ ప్రారంభించనున్నాం. గతంలో ఉన్న టైమింగ్ ఆధారంగానే ట్రైన్​ను నడపనున్నాం. దీనికోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్​లో కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే అనుమతిస్తాము. వెయిటింగ్ లిస్ట్​లో ఉన్నా అనుమతించం. ప్రయాణికులను రైళ్లల్లోకి అనుమతించే ముందు శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. ప్రయాణికుల్లో ఎవరికైనా అధిక ఉష్ణోగ్రత ఉంటే వారిని కంపార్టుమెంటులోకి అనుమతించం. ఆరోగ్యసేతు యాప్​ను డౌన్​లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తాం. రైల్వే స్టేషన్​లో ప్యాకెడ్ ఫుడ్ దొరకదు. ప్రయాణికులు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలి.

  • రైల్వే ఉద్యోగులకు ఉన్న నిబంధనలు ఏమిటి?

ప్రతి ఒక్క ఉద్యోగికి మాస్క్ తప్పనిసరి. తరచుగా శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగులందరికీ మాస్కులు, గ్లౌజులు అందజేశాం.

  • స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లల్లో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?

ప్రస్తుతం ఇక్కడు వచ్చేది ఒక్కటే ట్రైన్ అది కేరళ ఎక్స్​ప్రెస్. కానీ దాని గురించి ఎటువంటి టైమింగ్స్ రాలేదు.

ఇదీ చదవండి: వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.