'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు చిత్తూరు జిల్లా తుమ్మలగుంట వైఎస్సార్ క్రీడామైదానంలో ఆసక్తికరంగా సాగుతున్నాయి. విద్యార్థుల్లోని క్రీడాస్ఫూర్తిని వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. యువ క్రీడాకారులు కేరింతల మధ్య 12 జట్లు తలపడగా... అందులో ఆరు జట్లు విజేతలుగా నిలిచాయి. ఎమరాల్డ్ జూనియర్ కళాశాల, సీకాం జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఎమరాల్డ్ డిగ్రీ కళాశాల, ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలల జట్లు విజేతలుగా నిలిచాయి.
ఇదీ చదవండి