ETV Bharat / state

మళ్లీ పావులు.. ‘పుర’ స్థలం కబ్జాకు యత్నం - శ్రీకాళహస్తీలో డంపింగ్ యార్డు వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి శివారు ప్రాంతం, తొట్టంబేడు గ్రామానికి వెళ్లే మార్గంలో.. ఇది వరకు పురపాలక సంఘానికి సంబంధించి డంపింగ్‌ యార్డు ఉంది. ఈ స్థలాన్ని అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. అవకాశాలను అనుకూలంగా చేసుకుని ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు.

dumping yard
dumping yard
author img

By

Published : May 17, 2021, 7:31 PM IST

చెత్త నిల్వల కోసం కేటాయించిన డంపింగ్‌ యార్డు స్థలాన్ని అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. అవకాశాలను అనుకూలంగా చేసుకుని ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి శివారు ప్రాంతం, తొట్టంబేడు గ్రామానికి వెళ్లే మార్గంలో ఇది వరకు పురపాలక సంఘానికి సంబంధించి డంపింగ్‌ యార్డుగా ఉంటూ వచ్చింది. అప్పట్లో తొట్టంబేడు పంచాయతీ ఆమోదంతో సర్వే నంబరు 28/34 సర్వే నంబరులో రెండు ఎకరాల స్థలాన్ని పంచాయతీ నుంచి తీసుకున్నారు. ఇప్పటికీ పురపాలక సంఘ అనుభవంలోనే ఉంది. కొన్నాళ్ల పాటు ఇక్కడే చెత్త నిల్వలు చేసే్తూ డంపింగ్‌ యార్డుగా వాడుకుంటూ వచ్చారు. పట్టణ పరిధి పెరగడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు కావడంతో నివాస గృహాల మధ్య డంపింగ్‌ యార్డు ఉండకూడదన్న ఆలోచనతో చెత్త నిల్వలు చేయడం లేదు. ప్రత్యామ్నాయంగా తొట్టంబేడు తిప్పలకు చెందిన ప్రాంతంలో ప్రస్తుతం చెత్తను వేసే్తున్నారు. ఇది వరకు డంపింగ్‌ యార్డు కొనసాగుతున్న స్థలం పట్టణానికి సమీపంలో, చెన్నై రోడ్డును ఆనుకుని ఉండటంతో ఇక్కడి స్థలానికి విలువ పెరిగింది. ఇక్కడి భూమి నిరుపయోగంగా ఉండటం, ప్రాధాన్యత ఎక్కువ కావడంతో అక్రమార్కుల కన్నుపడింది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఇక్కడి స్థలం దాదాపు రూ.కోటి వరకు పలుకుతోంది.

‘దస్త్రం’.. అధికారులకు గండం

పురపాలక సంఘ పరిధిలోని ఈ స్థలానికి సంబంధించిన దస్త్రం మాయం చేయాలన్న వ్యూహంతో అక్రమార్కులు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే విషయమై అనుకూలంగా వ్యవహరించలేదన్న అధికారిపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఆయన బదిలీ అయ్యాక రాత్రికి రాత్రి పనులు మరింత వేగవంతం చేయడంతో పాటు దస్త్రాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ ఈ స్థలం పురపాలక సంఘానికి చెందిందని, ఆక్రమణలు జరగనీయమని స్పష్టం చేశారు. రోజులు గడిచే కొద్దీ ప్రస్తుత అధికారులపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి అధికారి పాలనలో వ్యూహాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పురపాలక సంఘానికి సంబంధించిన స్థలం అక్రమార్కుల పరం కాకుండా అధికారులు చొరవ చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.

చెత్త నిల్వల కోసం కేటాయించిన డంపింగ్‌ యార్డు స్థలాన్ని అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. అవకాశాలను అనుకూలంగా చేసుకుని ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి శివారు ప్రాంతం, తొట్టంబేడు గ్రామానికి వెళ్లే మార్గంలో ఇది వరకు పురపాలక సంఘానికి సంబంధించి డంపింగ్‌ యార్డుగా ఉంటూ వచ్చింది. అప్పట్లో తొట్టంబేడు పంచాయతీ ఆమోదంతో సర్వే నంబరు 28/34 సర్వే నంబరులో రెండు ఎకరాల స్థలాన్ని పంచాయతీ నుంచి తీసుకున్నారు. ఇప్పటికీ పురపాలక సంఘ అనుభవంలోనే ఉంది. కొన్నాళ్ల పాటు ఇక్కడే చెత్త నిల్వలు చేసే్తూ డంపింగ్‌ యార్డుగా వాడుకుంటూ వచ్చారు. పట్టణ పరిధి పెరగడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు కావడంతో నివాస గృహాల మధ్య డంపింగ్‌ యార్డు ఉండకూడదన్న ఆలోచనతో చెత్త నిల్వలు చేయడం లేదు. ప్రత్యామ్నాయంగా తొట్టంబేడు తిప్పలకు చెందిన ప్రాంతంలో ప్రస్తుతం చెత్తను వేసే్తున్నారు. ఇది వరకు డంపింగ్‌ యార్డు కొనసాగుతున్న స్థలం పట్టణానికి సమీపంలో, చెన్నై రోడ్డును ఆనుకుని ఉండటంతో ఇక్కడి స్థలానికి విలువ పెరిగింది. ఇక్కడి భూమి నిరుపయోగంగా ఉండటం, ప్రాధాన్యత ఎక్కువ కావడంతో అక్రమార్కుల కన్నుపడింది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఇక్కడి స్థలం దాదాపు రూ.కోటి వరకు పలుకుతోంది.

‘దస్త్రం’.. అధికారులకు గండం

పురపాలక సంఘ పరిధిలోని ఈ స్థలానికి సంబంధించిన దస్త్రం మాయం చేయాలన్న వ్యూహంతో అక్రమార్కులు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే విషయమై అనుకూలంగా వ్యవహరించలేదన్న అధికారిపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఆయన బదిలీ అయ్యాక రాత్రికి రాత్రి పనులు మరింత వేగవంతం చేయడంతో పాటు దస్త్రాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ ఈ స్థలం పురపాలక సంఘానికి చెందిందని, ఆక్రమణలు జరగనీయమని స్పష్టం చేశారు. రోజులు గడిచే కొద్దీ ప్రస్తుత అధికారులపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి అధికారి పాలనలో వ్యూహాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పురపాలక సంఘానికి సంబంధించిన స్థలం అక్రమార్కుల పరం కాకుండా అధికారులు చొరవ చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఎంపీ రఘురామ..ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.