ETV Bharat / state

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులు - devotees lined up in midnight at tirumala news update

కిందటేడాది వరకు ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన తితిదే.. ఈసారి సాంప్రదాయాన్ని మార్చి.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు జారీ చేసిన తితిదే.. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3 వరకు రోజుకు 10 వేల మంది చొప్పున మొత్తం లక్ష మందికి సర్వదర్శన టికెట్లు ఇస్తోంది. దీంతో టోకెన్ల కోసం రాత్రి నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

Vaikuntha dwara darshan tokens
టోకెన్ల కోసం భారులు తీరిన భక్తులు
author img

By

Published : Dec 24, 2020, 8:36 AM IST

టోకెన్ల కోసం భారులు తీరిన భక్తులు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం రాత్రి నుంచే భక్తులు తిరుపతిలో క్యూలైన్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటల వరకూ టోకెన్ల క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో.. రోడ్లపైనే కూర్చుండిపోయారు. నగరపాలక సంస్థ కార్యాలయం, రామచంద్ర పుష్కరణి, మహతి ఆడిటోరియం, బైరాగిపట్టెడ రామానాయుడు పాఠశాల, వైకుంఠపురం నూతన కూరగాయాల మార్కెట్ టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద.. అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. చలిలో చిన్నపిల్లలతో చాలా మంది తల్లితండ్రులు ఇబ్బందులు పడ్డారు.

నేటి నుంచి జనవరి 3 వరకూ పది రోజుల వైకుంఠదర్శనాలకు గానూ లక్ష సర్వదర్శనం టోకెన్లు పంపిణీ చేయాలని తితిదే భావించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రెండు లక్షల ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు విక్రయించటంతో.. కొవిడ్ నిబంధనలకు భంగం కలగకుండా సర్వదర్శనం టోకెన్లను కేవలం తిరుపతి స్థానికులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చూడండి:

భక్తులపై లాఠీ ఛార్జ్ చేయలేదు.. డ్రోన్లు సీజ్ చేశాం: తితిదే

టోకెన్ల కోసం భారులు తీరిన భక్తులు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం రాత్రి నుంచే భక్తులు తిరుపతిలో క్యూలైన్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటల వరకూ టోకెన్ల క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో.. రోడ్లపైనే కూర్చుండిపోయారు. నగరపాలక సంస్థ కార్యాలయం, రామచంద్ర పుష్కరణి, మహతి ఆడిటోరియం, బైరాగిపట్టెడ రామానాయుడు పాఠశాల, వైకుంఠపురం నూతన కూరగాయాల మార్కెట్ టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద.. అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. చలిలో చిన్నపిల్లలతో చాలా మంది తల్లితండ్రులు ఇబ్బందులు పడ్డారు.

నేటి నుంచి జనవరి 3 వరకూ పది రోజుల వైకుంఠదర్శనాలకు గానూ లక్ష సర్వదర్శనం టోకెన్లు పంపిణీ చేయాలని తితిదే భావించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రెండు లక్షల ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు విక్రయించటంతో.. కొవిడ్ నిబంధనలకు భంగం కలగకుండా సర్వదర్శనం టోకెన్లను కేవలం తిరుపతి స్థానికులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చూడండి:

భక్తులపై లాఠీ ఛార్జ్ చేయలేదు.. డ్రోన్లు సీజ్ చేశాం: తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.