ETV Bharat / state

ఎర్రగుంటపల్లిలో సీసీరోడ్డు శిలాఫలకం ధ్వంసం - ఎర్రగుంటపల్లిలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసం

సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లిలో.. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా దానిని ప్రారంభించారు. ఫలకాన్ని ధ్వంసం చేయడంపై.. వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

foundation stone destroy
ధ్వంసమైన శిలాఫలకం
author img

By

Published : Nov 28, 2020, 10:27 PM IST

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ.. వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లిలో జరిగిందీ ఘటన. సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నాటి గుర్తులోని.. సీఎం జగన్, మంత్రి నారాయణ స్వామి చిత్రాలను చెరిపేశారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా.. ఈ శిలాఫలకాలు ఆవిష్కరించి రోడ్డు ప్రారంభించారు. మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఫలకాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేశారని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ.. వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లిలో జరిగిందీ ఘటన. సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నాటి గుర్తులోని.. సీఎం జగన్, మంత్రి నారాయణ స్వామి చిత్రాలను చెరిపేశారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా.. ఈ శిలాఫలకాలు ఆవిష్కరించి రోడ్డు ప్రారంభించారు. మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఫలకాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేశారని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

రూ.500 ఇవ్వడం.. రివర్స్ టెండరింగ్ లో భాగమా?: లోకేశ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.