ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ఆ వ్యక్తులు వెంటనే క్వారంటైన్ కేంద్రంలో చేరి వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని.. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కోరారు. శ్రీకాళహస్తి క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పట్టణంలో ఒకే రోజు 5 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనందున దిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రంలో ఉండాలని కోరారు. వారిని వికృతమాల క్వారంటైన్కు తరలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చదవండి: