ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను విధ్వంసం

author img

By

Published : Nov 26, 2020, 10:02 PM IST

నివర్ తుపాను ధాటికి చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. అధికారుల ముందస్తు జాగ్రత్తల కారణంగా.. కొంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం తగ్గింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు, వాగులు, వంకలు నిండిపోయాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ హెచ్చరించారు.

chittoor floods
చిత్తూరును వణికించిన నివర్ తపాను
చిత్తూరును వణికించిన నివర్ తపాను

చిత్తూరు జిల్లా సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో.. నివర్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో.. గేట్లను ఎత్తి వరద నీటిని కిందకు వదిలేస్తున్నారు. అరణియార్‌, కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద నీరు.. స్వర్ణముఖి నదికి చేరుతోంది. జిల్లాలో సగటున ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్తూరులో సన్నద్ధత:

నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచామని.. అనంతపురం రేంజి డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. భారీ వర్షాలతో పూర్తి నీటిమట్టానికి చేరిన అరణియార్ జలాశయాన్ని ఆయన పరిశీలించారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని అరుణానదిలోకి వదలడంతో.. శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. పోలీసు పహారా ఉంచి.. అటు వైపు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు డీఐజీ తెలిపారు.

తంబళ్లపల్లెలో తుపాను తీవ్రత:

తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి తీవ్రమైన గాలులు, భారీ వర్షం.. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పెద్దేరు ప్రాజెక్టు పొంగుతుండటంతో.. వాగు దాటలేక రాకపోకలు స్తంభించాయి. తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల పరిధిలోని కోటాల, ఆర్యన్ తండా, జింజర్ పెంట, మందలవారి, బండమ్మ దిగువ పల్లె ప్రజలు జలదిగ్బంధంలో ఉండిపోయారు.

150 విద్యుత్ స్తంభాలు, 25 ట్రన్స్​ఫార్మర్లు నేలకూలాయి. నియోజకవర్గంలో 80% అంధకారంలో ఉంది. 150 హెక్టార్లలో వరి నీటమునిగింది. వంద హెక్టార్లకు పైగా టమోటా, మొక్కజొన్న పంటలు దెబ్బలు తిన్నాయని వ్యవసాయ శాఖల ఏడీలు పేర్కొన్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం.. పంట నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాకుమానుగుట్ట, దబ్బ గుట్ట, చిన్న ఏరు జలాశయాలు, నియోజకవర్గంలో 80శాతం చెరువులు, కుంటలు నిండి ప్రమాద స్థితిలో పొంగుతున్నాయి. హంద్రీనీవా కుప్పం, పీలేరు ప్రధాన కాలువలు చాలాచోట్ల తెగిపోయాయి.

శ్రీకాళహస్తిలో జాగ్రత్త చర్యలు:

తుపాను ప్రభావంతో వరద పోటెత్తుతున్న ముప్పు ప్రాంతాలను.. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ప్రాంతంలో ఆయన పర్యటించారు. నది వద్దకు ప్రజలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వెయ్యి మంది పోలీసు సిబ్బందితో పాటు రెస్క్యూ ఆపరేషన్ టీమ్​ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

పొంగుతున్న వాగులు, వంకలు:

సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కె.వి.పురం, పిచ్చాటూరు, వరదయ్యపాలెం మండలాల్లో 390 కుటుంబాలను వరద సహాయ కేంద్రాలకు తీసుకెల్లారు. శేషాచలం అటవీప్రాంతంలో వర్షాల ధాటికి.. తిరుమలలోని గోగర్భం, పాపనాశనం, కుమారధార, పసుపుధార జలాశయాల నుంచి నీటిని కిందకు వదిలారు. దిగువనున్న మల్లెమడుగు జలాశయానికి వరదనీరు చేరడంతో.. గేట్లను ఎత్తి ఎత్తివేశారు. విద్యుత్‌ మోటర్లు కాపాడుకొనే క్రమంలో ముగ్గురు యువకులు రాళ్లవంక వాగులో చిక్కుకపోయారు. ఒకరు గల్లంతవగా మరో ఇద్దరిని రాష్ట్రవిపత్తుల నిర్వహణ బృందాలు రక్షించాయి.

శ్రీకాళహస్తి, వరదయ్య పాలెం, పిచ్చాటూరు, కెవిపురం, తొట్టంబేడు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరగా.. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. నివర్ తుపాను తగ్గే వరకు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తుపాను తీవ్రత కొనసాగుతుండటంతో.. వరుసగా మూడో రోజూ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు

చిత్తూరును వణికించిన నివర్ తపాను

చిత్తూరు జిల్లా సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో.. నివర్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో.. గేట్లను ఎత్తి వరద నీటిని కిందకు వదిలేస్తున్నారు. అరణియార్‌, కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద నీరు.. స్వర్ణముఖి నదికి చేరుతోంది. జిల్లాలో సగటున ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్తూరులో సన్నద్ధత:

నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచామని.. అనంతపురం రేంజి డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. భారీ వర్షాలతో పూర్తి నీటిమట్టానికి చేరిన అరణియార్ జలాశయాన్ని ఆయన పరిశీలించారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని అరుణానదిలోకి వదలడంతో.. శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. పోలీసు పహారా ఉంచి.. అటు వైపు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు డీఐజీ తెలిపారు.

తంబళ్లపల్లెలో తుపాను తీవ్రత:

తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి తీవ్రమైన గాలులు, భారీ వర్షం.. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పెద్దేరు ప్రాజెక్టు పొంగుతుండటంతో.. వాగు దాటలేక రాకపోకలు స్తంభించాయి. తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల పరిధిలోని కోటాల, ఆర్యన్ తండా, జింజర్ పెంట, మందలవారి, బండమ్మ దిగువ పల్లె ప్రజలు జలదిగ్బంధంలో ఉండిపోయారు.

150 విద్యుత్ స్తంభాలు, 25 ట్రన్స్​ఫార్మర్లు నేలకూలాయి. నియోజకవర్గంలో 80% అంధకారంలో ఉంది. 150 హెక్టార్లలో వరి నీటమునిగింది. వంద హెక్టార్లకు పైగా టమోటా, మొక్కజొన్న పంటలు దెబ్బలు తిన్నాయని వ్యవసాయ శాఖల ఏడీలు పేర్కొన్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం.. పంట నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాకుమానుగుట్ట, దబ్బ గుట్ట, చిన్న ఏరు జలాశయాలు, నియోజకవర్గంలో 80శాతం చెరువులు, కుంటలు నిండి ప్రమాద స్థితిలో పొంగుతున్నాయి. హంద్రీనీవా కుప్పం, పీలేరు ప్రధాన కాలువలు చాలాచోట్ల తెగిపోయాయి.

శ్రీకాళహస్తిలో జాగ్రత్త చర్యలు:

తుపాను ప్రభావంతో వరద పోటెత్తుతున్న ముప్పు ప్రాంతాలను.. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ప్రాంతంలో ఆయన పర్యటించారు. నది వద్దకు ప్రజలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వెయ్యి మంది పోలీసు సిబ్బందితో పాటు రెస్క్యూ ఆపరేషన్ టీమ్​ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

పొంగుతున్న వాగులు, వంకలు:

సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కె.వి.పురం, పిచ్చాటూరు, వరదయ్యపాలెం మండలాల్లో 390 కుటుంబాలను వరద సహాయ కేంద్రాలకు తీసుకెల్లారు. శేషాచలం అటవీప్రాంతంలో వర్షాల ధాటికి.. తిరుమలలోని గోగర్భం, పాపనాశనం, కుమారధార, పసుపుధార జలాశయాల నుంచి నీటిని కిందకు వదిలారు. దిగువనున్న మల్లెమడుగు జలాశయానికి వరదనీరు చేరడంతో.. గేట్లను ఎత్తి ఎత్తివేశారు. విద్యుత్‌ మోటర్లు కాపాడుకొనే క్రమంలో ముగ్గురు యువకులు రాళ్లవంక వాగులో చిక్కుకపోయారు. ఒకరు గల్లంతవగా మరో ఇద్దరిని రాష్ట్రవిపత్తుల నిర్వహణ బృందాలు రక్షించాయి.

శ్రీకాళహస్తి, వరదయ్య పాలెం, పిచ్చాటూరు, కెవిపురం, తొట్టంబేడు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరగా.. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. నివర్ తుపాను తగ్గే వరకు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తుపాను తీవ్రత కొనసాగుతుండటంతో.. వరుసగా మూడో రోజూ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.