మనిషి చేస్తున్న తప్పులకు మూగజీవాలు బలైపోతున్నాయి. నాటు బాంబు పేలి ఓ ఆవు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కోగిలేరు సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తోంది. పీఠానికి చెందిన ఓ ఆవు శనివారం సాయంత్రం మేతకు వెళ్లిన సమయంలో పొరపాటున వేటగాడు పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం ఛిద్రమైంది. ఇది గమనించిన స్థానికులు ఆవును పశు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆదివారం పశు వైద్యాధికారుల సమక్షంలో ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించారు.
ఇదీ చదవండి: