ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్

author img

By

Published : Nov 11, 2020, 4:24 PM IST

పాఠశాలకు వెళ్లిన తన కూతురు కిడ్నాప్​న​కు గురైందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

girl kidnap
girl kidnap

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లె ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్​న​కు గురైంది. ఈ మేరకు ఆమె తండ్రి వెంకట్​రెడ్డి పెద్దతిప్ప సముద్రం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకునేందుకు బస్​స్టాప్ వద్ద సహచర బాలికలతో వేచి ఉండగా దుండగులు తన కూతురిని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారెడ్డి పేర్కొన్నారు.



ఇదీ చదవండి

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లె ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్​న​కు గురైంది. ఈ మేరకు ఆమె తండ్రి వెంకట్​రెడ్డి పెద్దతిప్ప సముద్రం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకునేందుకు బస్​స్టాప్ వద్ద సహచర బాలికలతో వేచి ఉండగా దుండగులు తన కూతురిని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారెడ్డి పేర్కొన్నారు.



ఇదీ చదవండి

విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.