ETV Bharat / state

రైలు కింద పడి ఇద్దరు యువకులు మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

పీలేరు మండలంలో ఎర్రగుంటపల్లి సమీపంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి
author img

By

Published : Nov 19, 2019, 10:49 AM IST

రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. రైల్వే ట్రాక్​ పరిశీలనకు వెళ్లిన గ్యాంగ్​మెన్​ఎర్రగుంటపల్లి సమీపంలోని రైల్వేట్రాక్​పై మృతదేహాలను గుర్తించి.. గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోదా చేసి... అక్కడ లభించిన ఏటీఎం, చరవాణీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతులు చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన శివకుమార్ (24), పీలేరు పట్టణం కావలిపల్లికి చెందిన సాయి(23)గా గుర్తించారు. సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. రైల్వే ట్రాక్​ పరిశీలనకు వెళ్లిన గ్యాంగ్​మెన్​ఎర్రగుంటపల్లి సమీపంలోని రైల్వేట్రాక్​పై మృతదేహాలను గుర్తించి.. గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోదా చేసి... అక్కడ లభించిన ఏటీఎం, చరవాణీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతులు చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన శివకుమార్ (24), పీలేరు పట్టణం కావలిపల్లికి చెందిన సాయి(23)గా గుర్తించారు. సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :

రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా చేయండి..!

Intro:రైలు కింద పడి ఇద్దరు యువకుల మృతి...
రైలు కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం లో వెలుగు చూసింది. రైల్వే ట్రాక్ పరిశీలనకు వెళ్లిన గ్యాంగ్ మేన్ లకు పీలేరు మండలం ఎర్రగుంటపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న రైల్వే ట్రాక్ పై ఇద్దరు యువకులు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. ఈ సంఘటన రాత్రి జరిగిందని నిర్ధారించి ఈ విషయాన్ని గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో లభించిన ఏటీఎం, చరవాణి లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. చిత్తూరు జిల్లా ఎర్ర వారి పాలెం మండలం ఓఎస్ గొల్లపల్లికి చెందిన వేప రాశి రమణ కుమారుడు శివకుమార్ (24), పీలేరు పట్టణం కావలిపల్లికి చెందిన జయన్న కుమారుడు సాయి(23) గా గుర్తించారు.
ఈ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. యువకులకు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఏమీ లేవని వారి స్నేహితులు చెబుతున్నారు. యువకుల మృతి ని ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

నోట్. సార్ విజువల్స్ ఫోటోలు ఈటీవీ ఏపీ వాట్సాప్లో పంపించాను తీసుకోగలరు


Body:ఇద్దరు మృతి


Conclusion:పీలేరు మండలం శివారులో ఇద్దరు మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.