ETV Bharat / state

రాజా చెరువులో.. 100 ఎర్రచందన దుంగలు స్వాధీనం

author img

By

Published : Oct 13, 2020, 7:07 PM IST

శేషాచల అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువయ్యారు. చిత్తూరు జిల్లా రాజా చెరువులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 100 ఎర్రచందన దుంగల డంపును టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

100-red-sandalwood-seized-in-chittoor-sheshachala-forest
రాజా చెరువులో.. 100 ఎర్రచందన దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అధికారుల కూంబింగ్ చేపట్టారు. రాజంపేటలోని ఎన్ బోటిమానుపల్లి సమీపంలో గల రాజా చెరువులో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 100 ఎర్రచందన దుంగల డంపును తిరుపతి టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. పట్టుబడిన దుంగల విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్ఐ కృపానందం తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి టాస్క్​ఫోర్స్ సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అధికారుల కూంబింగ్ చేపట్టారు. రాజంపేటలోని ఎన్ బోటిమానుపల్లి సమీపంలో గల రాజా చెరువులో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 100 ఎర్రచందన దుంగల డంపును తిరుపతి టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. పట్టుబడిన దుంగల విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్ఐ కృపానందం తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి టాస్క్​ఫోర్స్ సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీ వారి సేవలో సినీ నిర్మాత దిల్ రాజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.