స్వచ్ఛ సర్వేక్షణ్అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి.ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ నిలిచాయి.దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.2019 సంవత్సరానికి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం విజ్ఞాన్భవన్లోప్రదానం చేశారు.
స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ జాబితాలో ఇండోర్ అగ్రస్థానంలో నిలిచింది.