ETV Bharat / state

సొంత జిల్లా కడపలో పర్యటిస్తోన్న సీఎం జగన్

author img

By

Published : Jul 8, 2019, 6:30 AM IST

Updated : Jul 8, 2019, 10:16 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రి కడపజిల్లా పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జులై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా "రైతు దినోత్సవం" నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

నేడు సొంత జిల్లాకు సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్మోరెడ్డి ఇవాళ ఆయన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్..ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 8.10 గంటలకు కడప చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఇడుపులపాయకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన సీఎం జగన్... స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం సమీపంలో రూ.3 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు జగన్ చేరుకుంటారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 24 స్టాళ్లను సందర్శిస్తారు. రైతులతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ వేదిక నుంచి రైతు దినోత్సవం ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తారు. ఇక్కడి నుంచే వైఎస్సార్ పింఛన్ల పథకాన్ని కొందరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జమ్మలమడుగులో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్​లో కడప విమానాశ్రయం చేరుకొని... ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.

ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కిరణ్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్మోరెడ్డి ఇవాళ ఆయన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్..ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 8.10 గంటలకు కడప చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఇడుపులపాయకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన సీఎం జగన్... స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం సమీపంలో రూ.3 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు జగన్ చేరుకుంటారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 24 స్టాళ్లను సందర్శిస్తారు. రైతులతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ వేదిక నుంచి రైతు దినోత్సవం ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తారు. ఇక్కడి నుంచే వైఎస్సార్ పింఛన్ల పథకాన్ని కొందరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జమ్మలమడుగులో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్​లో కడప విమానాశ్రయం చేరుకొని... ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.

ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కిరణ్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.

ఇదీ చదవండీ...

గోదావరి ఉధృతి.. 'పోలవరం' తట్టుకునే దారేది?

sample description
Last Updated : Jul 8, 2019, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.