ETV Bharat / state

ఆత్మహత్యలొద్దు.. అంతా మనతోనే: చంద్రబాబు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాటసభ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

author img

By

Published : Feb 11, 2019, 8:30 PM IST

Updated : Feb 11, 2019, 8:54 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాటసభ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. విభజన చట్టం హామీల అమలు కోసమే నిరసన తెలిపామని స్పష్టం చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన జాతీయ పార్టీల నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశమంతా అండగా నిలబడటమే తమ నైతిక విజయమని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్​కు న్యాయం జరుగుతుందనే భరోసాను జాతీయ నాయకులు ఇచ్చారని చెప్పారు. భావోద్వేగాలతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు విషయంలో ఆవేదన చెందారు. ఆయన కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అర్జునరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరూ ఉద్వేగానికి గురి కావొద్దని... ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తమ స్థాయి మరిచి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు. వారు చేసే ఆరోపణలు నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. సంకీర్ణ ధర్మాన్ని మోదీ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకీ అన్యాయం చేశారనే పోరాడుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు.
undefined

ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాటసభ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. విభజన చట్టం హామీల అమలు కోసమే నిరసన తెలిపామని స్పష్టం చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన జాతీయ పార్టీల నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశమంతా అండగా నిలబడటమే తమ నైతిక విజయమని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్​కు న్యాయం జరుగుతుందనే భరోసాను జాతీయ నాయకులు ఇచ్చారని చెప్పారు. భావోద్వేగాలతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు విషయంలో ఆవేదన చెందారు. ఆయన కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అర్జునరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరూ ఉద్వేగానికి గురి కావొద్దని... ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తమ స్థాయి మరిచి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు. వారు చేసే ఆరోపణలు నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. సంకీర్ణ ధర్మాన్ని మోదీ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకీ అన్యాయం చేశారనే పోరాడుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు.
undefined
Uri (Jammu and Kashmir), Feb 11 (ANI): Suspicious movement was detected around camp of Army Artillery unit in Jammu and Kashmir's Uri, following which security personnel opened fire in that area. Giving updates on the same, Commanding Officer of 53 Battalion CRPF, Vinay Kumar said that the operation is still underway and that the officials can give any report on the situation only after assessing the ground situation. The operation is being conducted in Rajarwani area of Uri township and the area has been cordoned off by the state police and Indian Army.
Last Updated : Feb 11, 2019, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.