ETV Bharat / state

34రోజుల తర్వాత ఏపీలో రీపోలింగ్​ ఎందుకు?

ఏపీలో రీపోలింగ్ జరపటంపై ఈసీ నిర్ణయం సరైంది కాదని తెదేపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల తర్వాత రీపోలింగ్​ ఎందుకు అని ప్రశ్నించారు.

author img

By

Published : May 16, 2019, 7:54 PM IST

Updated : May 20, 2019, 9:46 AM IST

ఏపీలో రీపోలింగ్ జరపడమెందుకు?: సింఘ్వీ
34రోజుల తర్వాత ఏపీలో రీపోలింగ్​ ఎందుకు?

ఏపీలో రీపోలింగ్ జరపాలనే ఈసీ నిర్ణయం సరైంది కాదని కాంగ్రెస్​ నేత అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం, ఆప్​ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికలైన 34 రోజుల తర్వాత రీపోలింగ్ ఎందుకో అర్ధం కావటం లేదన్నారు. ఫిర్యాదు వస్తే విచారణ చేసి నిజానిజాలు తెలిశాక చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా రీపోలింగ్ జరపాలని ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని సింఘ్వీ అన్నారు.

తెదేపా అనుకూల బూత్​లలోనే రీపోలింగా?
రీపోలింగ్ విషయంలో చెవిరెడ్డి సీఎస్‌కు చెప్పినదాన్ని ఎన్నికల సంఘం ఫిర్యాదుగా తీసుకుని... రీపోలింగ్ జరుపుతున్నారని సీఎం రమేశ్ మండిపడ్డారు. చంద్రగిరిలోని 5 బూత్‌లు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయనే ఉద్దేశంతో... ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈసీ.. భాజపా కమిషన్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయాలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూస్తామని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

మా ఫిర్యాదులు పట్టించుకోరా..
మేం ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామన్న ఈసీ... భాజపా, వైకాపా చెప్పినట్టు చేస్తొందని కంభంపాటి ఆరోపించారు.

34రోజుల తర్వాత ఏపీలో రీపోలింగ్​ ఎందుకు?

ఏపీలో రీపోలింగ్ జరపాలనే ఈసీ నిర్ణయం సరైంది కాదని కాంగ్రెస్​ నేత అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం, ఆప్​ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికలైన 34 రోజుల తర్వాత రీపోలింగ్ ఎందుకో అర్ధం కావటం లేదన్నారు. ఫిర్యాదు వస్తే విచారణ చేసి నిజానిజాలు తెలిశాక చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా రీపోలింగ్ జరపాలని ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని సింఘ్వీ అన్నారు.

తెదేపా అనుకూల బూత్​లలోనే రీపోలింగా?
రీపోలింగ్ విషయంలో చెవిరెడ్డి సీఎస్‌కు చెప్పినదాన్ని ఎన్నికల సంఘం ఫిర్యాదుగా తీసుకుని... రీపోలింగ్ జరుపుతున్నారని సీఎం రమేశ్ మండిపడ్డారు. చంద్రగిరిలోని 5 బూత్‌లు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయనే ఉద్దేశంతో... ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈసీ.. భాజపా కమిషన్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయాలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూస్తామని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

మా ఫిర్యాదులు పట్టించుకోరా..
మేం ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామన్న ఈసీ... భాజపా, వైకాపా చెప్పినట్టు చేస్తొందని కంభంపాటి ఆరోపించారు.

Intro:JK_AP_NLR_04_16_RUNAMAPI_NO_RAJA_PKG_C3
anc
రైతుకు రుణమాఫీ నిధులు అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మూడు విడతలు వచ్చాయి గానీ నాలుగు ఐదు విడతలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర కరవు పరిస్థితుల్లో ఈ రుణమాఫీ విడుదలైన ఆదుకుంటా అనుకుంటే అవి కూడా రాకపోవడంతో రైతు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం.
వాయిస్ ఓవర్ ;1
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ నిధులు ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో ఇచ్చారని, నాలుగవ విడతకూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ నాలుగు విడత రాకపోవడంతో రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి .ఈ నేపథ్యంలో రుణ మాఫీ నిధులైనా రైతును ఆదుకుంటాయి అనుకుంటే అవి కూడా రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బైట్, రైతులు నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్ ;2
ప్రభుత్వం నాలుగో విడత రుణం ఇస్తున్నామని ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించింది. అయితే ఆ నిధులు కొద్ది మొత్తంలో మాత్రమే విడుదల చేశారు. మిగతా నిధుల విడుదల చేయకపోవడంతో చాలా మంది రైతులకు నాలుగో విడత రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు అంటున్నారు. నాలుగో విడత రాలేదు 5వ విడత ఏం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బైట్స్; రైతులు నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్;3
ప్రభుత్వం రుణమాఫీ చేయడం బాగానే ఉందని రైతు నాయకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం లకు మూడు విడుదల చేసింది నాలుగైదు విడుదల వేసి ఉంటే ఇంకా బాగుండేది అని, ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా వేయాలని రైతు నాయకులు కోరుతున్నారు.
బైట్; ఆది శేషా రెడ్డి, రైతు నాయకుడు నెల్లూరు జిల్లా


Body:రుణమాఫీ నిధులు


Conclusion:బి రాజా నెల్లూరు
Last Updated : May 20, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.