ETV Bharat / state

వైశాలి కిడ్నాప్​ కేసు.. నవీన్​రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Dec 24, 2022, 1:46 PM IST

Dentist Kidnap Case Updates: తెలంగాణలో సంచలనం సృష్టించిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

naveen reddy
naveen reddy

Adibatla Kidnap Case Updates: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలు నుంచి నవీన్​రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కిడ్నాప్ సీన్ రీ-కనస్ట్రక్షన్‌ చేయనున్నారు.

అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్​రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. నవీన్​రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు.

పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్​రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో వివాహానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

Adibatla Kidnap Case Updates: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలు నుంచి నవీన్​రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కిడ్నాప్ సీన్ రీ-కనస్ట్రక్షన్‌ చేయనున్నారు.

అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్​రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. నవీన్​రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు.

పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్​రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో వివాహానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.