ETV Bharat / state

అనంత రైతుల పట్ల ఎందుకిత నిర్లక్ష్యం?: కాలవ శ్రీనివాసులు

author img

By

Published : Dec 3, 2020, 9:01 PM IST

అనంతపురం జిల్లా రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పంట నష్టపోయిన కర్షకులకు సాయం చేయటం లేదని దుయ్యబట్టారు.

kalava srinivasulu
kalava srinivasulu

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని అనంతపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటోందని అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పంట నష్టాన్ని పరిశీలించాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు నిద్రపోతున్నారని కాలవ దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందులపై ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా శాసనసభ సమావేశాల్లో మాట్లాడలేదని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతుల పక్షాన సీఎం జగన్​ను ఎమ్మెల్యేలు నిలదీయాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 2018 ఖరీఫ్​లో పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ రాయితీగా ఇవ్వాల్సిన 967 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని అనంతపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటోందని అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పంట నష్టాన్ని పరిశీలించాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు నిద్రపోతున్నారని కాలవ దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందులపై ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా శాసనసభ సమావేశాల్లో మాట్లాడలేదని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతుల పక్షాన సీఎం జగన్​ను ఎమ్మెల్యేలు నిలదీయాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 2018 ఖరీఫ్​లో పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ రాయితీగా ఇవ్వాల్సిన 967 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదన్నారు.

ఇదీ చదవండి

రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.