కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ 'ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్'లో పనిచేసే మహిళా కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా పరిగిలోని ఆ సంస్థ గేటు ముందు సీపీఎం ఆధ్వర్యంలో బైఠాయించి.. బోనస్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోమని కార్మికులు ప్రకటించారు. ఈ పరిణామంతో పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇతర సంస్థల్లో మహిళా కార్మికులకు పని ఆధారంగా రూ. 15,000 జీతం ఇస్తుండగా.. ఇక్కడ రూ. 6,000 తోనే సరిపెడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. వేతనాలతో పాటు బోనస్ ప్రకటించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి'