ETV Bharat / state

నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి - అనంతపురం జిల్లాలో ఇద్దరు మృతి

నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్​కు చెందిన వారుగా గుర్తించారు.

two people died in ananthapur district
నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Jan 11, 2020, 6:35 PM IST

నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి

రాజస్థాన్​ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మడకశిర మండలంలోని సి. కొడిగేపల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో రాజస్థాన్​కి చెందిన పలువురు యువకులు జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం అక్కడ నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు సంజయ్​ సింగ్, విక్రమ్​ సింగ్​ అనే యువకులు వెళ్లారు. ఎంతసేపు చూసినా వారి తిరిగి రాకపోవడం వల్ల తోటివారు అక్కడికి వెళ్లి చూశారు. నీటి తొట్టెలో వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి

రాజస్థాన్​ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మడకశిర మండలంలోని సి. కొడిగేపల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో రాజస్థాన్​కి చెందిన పలువురు యువకులు జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం అక్కడ నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు సంజయ్​ సింగ్, విక్రమ్​ సింగ్​ అనే యువకులు వెళ్లారు. ఎంతసేపు చూసినా వారి తిరిగి రాకపోవడం వల్ల తోటివారు అక్కడికి వెళ్లి చూశారు. నీటి తొట్టెలో వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి


Intro:నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆ గ్రామస్తులను కలచివేసింది.


Body:అనంతపురం జిల్లా మడకశిర మండలం లోని సి. కొడిగేపల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో పొట్టకూటి కోసం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు అక్కడ వ్యవసాయ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఆ క్షేత్రంలోని నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు సంజయ్ సింగ్, విక్రమ్ సింగ్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. ఎంతసేపటికి వారు తిరిగి రాకపోవడంతో తోటివారు అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు వారిని పరిశీలించి వారు మృతి చెందినట్లు తెలిపారు. వారి మరణ వార్త వినగానే తోటి స్నేహితుల్లొ, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Conclusion:నీటి తొట్టెలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి ఒకరి తర్వాత ఒకరు పడి అపస్మారక స్థితిలో ఉన్న వారిని మేము ఆసుపత్రికి తరలించాం. వైద్యులు వారిని పరీక్షించి వారు మరణించి చాలాసేపు అయింది అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటూ అక్కడి పర్యవేక్షకుడు తెలిపారు.


బైట్స్ : ప్రేమ రామ్ చౌదరి, వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షకుడు, సీ. కొడిగేపల్లి గ్రామం, మడకశిర మండలం.


యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్ : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.