అనంతపురం జిల్లా ఉరవకొండలోని వాసవి కల్యాణ మండపం సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. నాగశేషమ్మ అనే వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి వాసవి కల్యాణ మండపం సమీపంలో నివాసముంటున్నారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులు శుభకార్యం నిమిత్తం బళ్లారికి వెళ్లగా.. నాగశేషమ్మ పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో నిద్రపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు. అలికిడి విని లేచి వచ్చిన వృద్ధురాలిని కత్తితో బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి..