ETV Bharat / state

ఉరవకొండలో వృద్ధురాలిని బెదిరించి చోరీ.. బంగారం, నగదు అపహరణ

author img

By

Published : Nov 18, 2019, 11:55 AM IST

కుటుంబం మొత్తం ఊరెళ్లింది. వృద్ధురాలు పక్కింట్లో నిద్రపోయింది. అదే అవకాశంగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళాలు పగులగొట్టి.. బీరువాలో ఉన్న నగలు, నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది.

ఉరవకొండలో దొంగతనం
ఉరవకొండలో దొంగతనం

అనంతపురం జిల్లా ఉరవకొండలోని వాసవి కల్యాణ మండపం సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. నాగశేషమ్మ అనే వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి వాసవి కల్యాణ మండపం సమీపంలో నివాసముంటున్నారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులు శుభకార్యం నిమిత్తం బళ్లారికి వెళ్లగా.. నాగశేషమ్మ పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో నిద్రపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు. అలికిడి విని లేచి వచ్చిన వృద్ధురాలిని కత్తితో బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఉరవకొండలో దొంగతనం

అనంతపురం జిల్లా ఉరవకొండలోని వాసవి కల్యాణ మండపం సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. నాగశేషమ్మ అనే వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి వాసవి కల్యాణ మండపం సమీపంలో నివాసముంటున్నారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులు శుభకార్యం నిమిత్తం బళ్లారికి వెళ్లగా.. నాగశేషమ్మ పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో నిద్రపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు. అలికిడి విని లేచి వచ్చిన వృద్ధురాలిని కత్తితో బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మూడో అంతస్తు నుంచి చిన్నారిని తోసేసిన బాబాయి

Intro:అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం సమీపంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు అలికిడి విని లేచిన వృద్ధురాలిని కత్తితో బేదిరించారు. 70 గ్రాముల బంగారాన్ని, 1.50 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

ఉరవకొండ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం సమీపంలో నివసిస్తున్న నాగ శేషమ్మ కుటుంబసభ్యులు శుభకార్యం నిమిత్తం బళ్లారికి వెళ్లారు. దీంతో వృద్ధురాలైన నాగ శేషమ్మ పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో నిద్రపోయింది. అదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం 1.50 లక్షల నగదును తీసుకున్నారు. అలికిడి విని వృద్ధురాలు నాగ శేషమ్మ లేచి వచ్చి చూడగా ముగ్గురు దుండగులు కనిపించారు. ఎవరు అని ప్రశ్నించేలోపే ఆ దుండగులు చంపుతామని కత్తితో బెదిరించి దోచుకున్న సొమ్ముతో అక్కడి నుండి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.


Body:బైట్ 1 : నాగ శేషమ్మ


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 18-11-2019
sluge : ap_atp_71_18_thiefs_gold_cash_chori_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.