ETV Bharat / state

అప్పులు చేసి పునాదులు వేసుకున్నాం... మాకు న్యాయం చేయండి

author img

By

Published : Nov 8, 2020, 1:15 PM IST

"నా ఇల్లు నా సొంతం - నా స్థలం నాకు కావాలి" అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నిరాశ్రయులైన నిరు పేదలకు సంక్రాంతి వరకు ఇళ్లను అందజేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ డిమాండ్ చేశారు. పేదలకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ఇళ్లను నిర్మించడానికి "శపూర్జి పళ్లం జీ" అనే కంపెనీతో తెదేపా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు వైకాపా అధికారంలోకి రావటంతో పనులను ఆపివేసి వేరొక కంపెనీకి పనులను అప్పగించింది.

tdp followers protest in guntakallu at anathapur district
అనంతపురం జిల్లా గుంతకల్లులో తెదేపా నాయకుల నిరిసన

"నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకు కావాలి"అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో... తెదేపా శ్రేణులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో తెదేపా ప్రభుత్వం... నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద 2018లో 331.41 కోట్లతో 4719 ఇళ్లను నిర్మించడానికి "శపూర్జి పళ్లం జీ" అనే కంపెనీకి ఒప్పందం ఇచ్చింది. దీని కోసం అనుమతులు మంజూరు చేసిన లబ్ధిదారులు నుంచి రూ.500 నుంచి 50వేల వరకు డీడీల రూపంలో మున్సిపాలిటీ అధికారులు డబ్బులు వసూలు చేశారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత సంస్థకు ఒప్పందం రద్దు చేసి కొంత సంస్థకు పనులు అప్పగించారు. అంతే కాకుండా తెదేపా హయంలో పేదలకు కేటాయించిన ఇళ్లను... ఇతరులకు ఇవ్వడంతో బాధితులు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

ఆశతో అప్పుచేసి పునాదులు వేసుకున్నాం

ప్రస్తుత వైకాపా ప్రభుత్వ నాయకులు తమ ఇళ్లను కూల్చి, తమ స్థలాల్లో వారి అమాన్యులకు ఇళ్లను నిర్మిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు వస్తుందని ఆశతో అప్పు చేసి పునాదులు వేసుకున్న తమ ఇళ్లను... రాత్రికి రాత్రే కూల్చి వేస్తున్నారని బాధితులు వాపోయారు.

ప్రజల కష్టాలను చూసి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు "నా ఇల్లు నా సొంతం" కార్యక్రమంలో భాగంగా... అక్కడకు చేరుకున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ లబ్ధిదారులతో మాట్లాడారు. నష్టపోయిన బాధితులకు ఇల్లు ఇప్పిస్తామని... భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇళ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం

తెదేపా ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు స్థలం కేటాయించడానికి అనుమతులు మంజూరు చేస్తే... ప్రస్తుత వైకాపా ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించుకోవాలని చెప్తుందని జితేంద్ర గౌడ్ అన్నారు. సంక్రాంతి పండుగ వరకు పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు!

"నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకు కావాలి"అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో... తెదేపా శ్రేణులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో తెదేపా ప్రభుత్వం... నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద 2018లో 331.41 కోట్లతో 4719 ఇళ్లను నిర్మించడానికి "శపూర్జి పళ్లం జీ" అనే కంపెనీకి ఒప్పందం ఇచ్చింది. దీని కోసం అనుమతులు మంజూరు చేసిన లబ్ధిదారులు నుంచి రూ.500 నుంచి 50వేల వరకు డీడీల రూపంలో మున్సిపాలిటీ అధికారులు డబ్బులు వసూలు చేశారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత సంస్థకు ఒప్పందం రద్దు చేసి కొంత సంస్థకు పనులు అప్పగించారు. అంతే కాకుండా తెదేపా హయంలో పేదలకు కేటాయించిన ఇళ్లను... ఇతరులకు ఇవ్వడంతో బాధితులు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

ఆశతో అప్పుచేసి పునాదులు వేసుకున్నాం

ప్రస్తుత వైకాపా ప్రభుత్వ నాయకులు తమ ఇళ్లను కూల్చి, తమ స్థలాల్లో వారి అమాన్యులకు ఇళ్లను నిర్మిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు వస్తుందని ఆశతో అప్పు చేసి పునాదులు వేసుకున్న తమ ఇళ్లను... రాత్రికి రాత్రే కూల్చి వేస్తున్నారని బాధితులు వాపోయారు.

ప్రజల కష్టాలను చూసి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు "నా ఇల్లు నా సొంతం" కార్యక్రమంలో భాగంగా... అక్కడకు చేరుకున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ లబ్ధిదారులతో మాట్లాడారు. నష్టపోయిన బాధితులకు ఇల్లు ఇప్పిస్తామని... భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇళ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం

తెదేపా ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు స్థలం కేటాయించడానికి అనుమతులు మంజూరు చేస్తే... ప్రస్తుత వైకాపా ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించుకోవాలని చెప్తుందని జితేంద్ర గౌడ్ అన్నారు. సంక్రాంతి పండుగ వరకు పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.