ETV Bharat / state

'దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారు'

author img

By

Published : Mar 10, 2021, 4:43 PM IST

అనంతపురం 22వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర పన్నారని తెదేపా అభ్యర్థి అనురాధ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టగా..పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెదేపా నేతల ఆందోళన
తెదేపా నేతల ఆందోళన

దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర పన్నారని...అనంతపురం 22వ వార్డు తెదేపా అభ్యర్థి అనురాధ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం ఏజెంట్లకు ఇచ్చిన ఓటర్‌ జాబితాలో 70 మంది గుర్తు తెలియని, ఫొటోల్లేని వ్యక్తులను చేర్చి వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూ తమపై లాఠీఛార్జి చేశారని చెప్పారు. ఆందోళన చేపట్టిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో..పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తెదేపా నేతల ఆందోళన

దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర పన్నారని...అనంతపురం 22వ వార్డు తెదేపా అభ్యర్థి అనురాధ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం ఏజెంట్లకు ఇచ్చిన ఓటర్‌ జాబితాలో 70 మంది గుర్తు తెలియని, ఫొటోల్లేని వ్యక్తులను చేర్చి వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూ తమపై లాఠీఛార్జి చేశారని చెప్పారు. ఆందోళన చేపట్టిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో..పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తెదేపా నేతల ఆందోళన

ఇదీచదవండి: వైవీ ఆంజనేయులు కారు అద్దాలను ధ్వంసం చేసిన వైకాపా శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.