ETV Bharat / state

రేణిగుంట-గుత్తి మార్గంలో రైలు వేగం పెంచుతూ ట్రయిల్ రన్ - అనంతపురం జిల్లా తాజా వార్తలు

భారత రైల్వేలలోని కొన్ని ముఖ్యమైన మార్గాలలో రైళ్ల వేగం పెంచడానికి రైల్వే బోర్డ్ విధాన పరమైన నిర్ణయ తీసుకుంది. ఫేస్ 1 కింద గోల్డెన్ క్వార్డ్రియల్ మార్గాలైన చెన్నై-ముంబై ఢిల్లీ-కలకత్తా-చెన్నై మార్గాలలో ఈ వేగం పెంచేందుకు రైల్వే శాఖ రక్షణ, మౌలిక వసతులు కల్పించారు.

sounth indian railway trains speed limit increase in first phase anatapur dst guthi and renigunta way trains speed increase trail run completed
sounth indian railway trains speed limit increase in first phase anatapur dst guthi and renigunta way trains speed increase trail run completed
author img

By

Published : Jul 16, 2020, 11:52 AM IST

రైల్వేలైన్ వేగం పెంచే క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేణిగుంట-గుత్తి మార్గంలో గుంతకల్లు డీఆర్ ఎం అలోక్ తివారి ఆధ్వర్యంలో ఆర్డీఎస్వో టీం కోర్ విజయవంతంగా నిర్వహించారు. రేణిగుంట నుంచి గుత్తికి 280కిలీమీటర్ల దూరంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా గంటకు 130 కి.మీ వేగంతో 30 నిమిషాలు పాటు విజయవంతంగా నిర్వహించారు.

ఈ మార్గంలో రైళ్ల వేగం పెంచడం కోసం మొత్తం 70 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జ్ ల ఆధునీకరణ, ట్రాక్ పటిష్టం లెవెల్ క్రాసింగ్ గేట్స్ లేకుండా తప్పించటం,34 స్టేషన్ల పరిధిలో డబుల్ డిస్టెన్స్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయటం వంటి అనేక పనులు పూర్తిచేసి ఈ వేగం పెంచే ట్రయిల్ రన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ట్రయిల్ రన్ మొత్తం నివేదిక ను రైల్వే సేఫ్టీ కమిషన్ కు నివేదించి అనుమతి వచ్చిన తర్వాత ముఖ్యమైన రైళ్ల వేగం పెంచనున్నట్టు గుంతకల్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ డీఆర్వో అలోక్ తివారి వెల్లడించారు. అలాగే గుత్తి-వాడి సెక్షన్ల మధ్య ఇదే తరహా పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యే లోపు 257 కి.మీ మార్గంలో రైళ్ల వేగం పెంచే పనులన్నీ పూర్తిచేసి ట్రయిల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి

అయినవారికి ఎలా ఉందో తెలియక... లోనికి వెళ్లలేక ఆందోళన

రైల్వేలైన్ వేగం పెంచే క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేణిగుంట-గుత్తి మార్గంలో గుంతకల్లు డీఆర్ ఎం అలోక్ తివారి ఆధ్వర్యంలో ఆర్డీఎస్వో టీం కోర్ విజయవంతంగా నిర్వహించారు. రేణిగుంట నుంచి గుత్తికి 280కిలీమీటర్ల దూరంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా గంటకు 130 కి.మీ వేగంతో 30 నిమిషాలు పాటు విజయవంతంగా నిర్వహించారు.

ఈ మార్గంలో రైళ్ల వేగం పెంచడం కోసం మొత్తం 70 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జ్ ల ఆధునీకరణ, ట్రాక్ పటిష్టం లెవెల్ క్రాసింగ్ గేట్స్ లేకుండా తప్పించటం,34 స్టేషన్ల పరిధిలో డబుల్ డిస్టెన్స్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయటం వంటి అనేక పనులు పూర్తిచేసి ఈ వేగం పెంచే ట్రయిల్ రన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ట్రయిల్ రన్ మొత్తం నివేదిక ను రైల్వే సేఫ్టీ కమిషన్ కు నివేదించి అనుమతి వచ్చిన తర్వాత ముఖ్యమైన రైళ్ల వేగం పెంచనున్నట్టు గుంతకల్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ డీఆర్వో అలోక్ తివారి వెల్లడించారు. అలాగే గుత్తి-వాడి సెక్షన్ల మధ్య ఇదే తరహా పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యే లోపు 257 కి.మీ మార్గంలో రైళ్ల వేగం పెంచే పనులన్నీ పూర్తిచేసి ట్రయిల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి

అయినవారికి ఎలా ఉందో తెలియక... లోనికి వెళ్లలేక ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.