అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆరు నెలల జీతాలను చెల్లించాలంటూ గత నాలుగు రోజులుగా ధర్నాలు చేస్తున్నా.. అధికారులు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని నిలదీశారు. తమను కాంట్రాక్టు పద్దతిలో కాకుండా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి