అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివార్లలో కొండల మధ్య... రోషన్ షా వలి దర్గా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 3 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలు...హిందూ, ముస్లింల సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ముస్లిం మత పెద్ద కాజావళి తెలిపారు. చివరి రోజు కావటంతో... మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది హిందూ ముస్లింలు తరలివచ్చారు. ఈ ప్రాంతమంతా జనసందోహంతో కిటకిటలాడింది. పోలీసు అధికారులు పటిష్ఠ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి... 'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి'