ETV Bharat / state

గుత్తిలో రోడ్డు ప్రమాదం... రెండు కాళ్లు కోల్పోయిన మహిళ - ananthapuram district road accident news

వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ రెండు కాళ్లు కోల్పోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మహిళ
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మహిళ
author img

By

Published : Jun 5, 2020, 1:17 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా రెండు కాళ్లను కోల్పోయింది. పి.ఆర్ పల్లికి చెందిన జయరాముడు తమ సోదరి కుమార్తె వివాహానికి గుంతకల్లుకు వెళ్లారు. వివాహం అనంతరం తమ స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో గుంతకల్లు నుంచి వెళ్తున్న ఆ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జయరాముడు భార్య రెండు కాళ్లను కోల్పోయింది. తాము కూలి పనులు చేస్తూ జీవిస్తున్నామని.... ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. తగిన వైద్యానికి సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా రెండు కాళ్లను కోల్పోయింది. పి.ఆర్ పల్లికి చెందిన జయరాముడు తమ సోదరి కుమార్తె వివాహానికి గుంతకల్లుకు వెళ్లారు. వివాహం అనంతరం తమ స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో గుంతకల్లు నుంచి వెళ్తున్న ఆ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జయరాముడు భార్య రెండు కాళ్లను కోల్పోయింది. తాము కూలి పనులు చేస్తూ జీవిస్తున్నామని.... ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. తగిన వైద్యానికి సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు.

ఇదీ చూడండి: చాకచక్యంతో యువతి ఆత్మహత్యను ఆపిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.