ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

author img

By

Published : Jan 30, 2020, 12:36 PM IST

ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టడం వల్ల ముగ్గురు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామానికి చెందిన ముగ్గురూ ఒకేసారి మరణించడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.

road-accident-in-ananthapuram-district
road-accident-in-ananthapuram-district

ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి మండలం ప్యాదిండి వద్ద 2 ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో.... ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు సీకె పల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికంగా నివాసం ఉంటున్న పుల్లన్న తన కుమారుడు ఆదినారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై పక్క ఊరు వెళ్లి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నరేష్ పని నిమిత్తం ధర్మవరానికి వెళ్తూ ప్యాదిండి వద్ద వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో నరేష్, పుల్లన్న అక్కడికక్కడే మృతి చెందగా... ఆదినారాయణ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి మండలం ప్యాదిండి వద్ద 2 ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో.... ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు సీకె పల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికంగా నివాసం ఉంటున్న పుల్లన్న తన కుమారుడు ఆదినారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై పక్క ఊరు వెళ్లి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నరేష్ పని నిమిత్తం ధర్మవరానికి వెళ్తూ ప్యాదిండి వద్ద వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో నరేష్, పుల్లన్న అక్కడికక్కడే మృతి చెందగా... ఆదినారాయణ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అభిమానుల మద్దతు బాగుంది: సిక్కిరెడ్డి

Intro:అనంతపురంజిల్లా చెన్న కొత్తపల్లి మండలం పే దిండి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు రెండు ద్విచక్ర వాహనాల్లో ఎదురుగా ఢీ కొన్నారు సి కె పల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన పుల్లన్న కుమారుడు ఆదినారాయణ అదే గ్రామానికి చెందిన నరేష్ మృతి చెందారు పని నిమిత్తం ధర్మవరానికి చక్రవాహం లో ఆదినారాయణ పుల్లన్న వస్తుండగా ధర్మవరం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నరేష్ వాహనం ఢీకొంది సంఘటన స్థలంలో నరేష్ పుల్లన్న మృతి చెందారు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదినారాయణ మృతి చెందాడు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ఆసుపత్రిలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి


Body:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.