ETV Bharat / state

కోరికలు తీరితే అగ్నిగుండలో నడవాల్సిందే..! - devotional news at ananatpaur dst

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రథసప్తమి పురస్కరించుకుని వీరభద్ర ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో మొదటి రోజు అగ్ని గుండ మహోత్సవం చేపట్టారు. కోరికలు తీరిన భక్తులు నిప్పులపై నడవటం ఆనవాయితీ. వీరభద్ర స్వామికి నిప్పులే ఆహారమని అర్చకులు తెలియజేశారు. అగ్నిగుండంలో దిగిన భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగదూ... అంతా ఆ స్వామే చూసుకుంటాడని ఇక్కడి భక్తుల విశ్వాసం.

rathasapthami celebrations at anantapur dst virabhadra swamy temple
నిప్పులగుండంలో నడుస్తున్న భక్తులు
author img

By

Published : Feb 1, 2020, 10:14 PM IST

నిప్పులగుండంలో నడుస్తున్న భక్తులు

నిప్పులగుండంలో నడుస్తున్న భక్తులు

ఇదీ చూడండిరథసప్తమి వేడుకల్లో చినశేషవాహనంపై తిరుమలేశుడు

Intro:శ్రీ వీరభద్ర స్వామి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ప్రతి ఏటా రథసప్తమి సందర్భంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రెండు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేకించి అగ్ని గుండం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్ని గుండంలో ప్రవేశించి వారి మొక్కుబడులు చెల్లించుకుంటారు.


Conclusion:శ్రీ వీరభద్ర స్వామి కి ఉదయం 5 గంటలకు బలిహరణతో నైవేద్యంగా నిప్పులే ఆయనకు ఆహారం కావడంతో వత్తితో మంగళహారతి చేసి అదే వత్తితో అగ్నిగుండం వెలిగిస్తారు. భగభగ మండే నిప్పుల్లో స్వామి వారు ప్రవేశిస్తారు. అనంతరం భక్తులు వారు కోరిన కోరికలు నెరవేరి నందుకు అగ్నిగుండంలో ప్రవేశించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. అగ్ని గుండం లో ప్రవేశించిన భక్తులకు ఎలాంటి హాని జరగదు వారికి ఆ స్వామి కృప ఉంటుంది అంటూ ఆలయ పూజారి భక్తులు తెలిపారు.


బైట్స్ 1: గురు స్వామి. శ్రీ వీరభద్ర స్వామి,ఆలయపూజారి.

బైట్స్ 2: శాంత వీరప్ప, వీరభద్ర స్వామి దేవాలయ చైర్మన్.



యు.నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.


మొబైల్ నెంబర్. : 8019247116.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.