ETV Bharat / state

అర్హులకు అన్యాయం చేస్తున్నారని కలెక్టర్​కు ఫిర్యాదు - అనంతపురం జిల్లా తాజా వార్తలు

చిత్రావతి జలాశయం ముంపు పరిహార జాబితాలో అర్హులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంటూ.. ముదిగుబ్బ మండలం రాఘవపల్లి వాసులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు.

complain to the Collector on chitravathi reservoir beneficiaries list at Anantapur
అర్హులకు అన్యాయం చేస్తున్నారని కలెక్టర్​కు ఫిర్యాదు
author img

By

Published : Oct 5, 2020, 11:36 PM IST

అనంతపురం జిల్లాలోని చిత్రావతి జలాశయం ముంపు పరిహార జాబితాలో అనర్హులకు చోటు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ముదిగుబ్బ మండలం రాఘవపల్లి వాసులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం ఆర్​అండ్​బీ అతిథి గృహం వద్ద పరిపాలనాధికారిని కలిసి వారి సమస్యలను వివరించారు.

ముదిగుబ్బ రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన 20 మంది పేర్లు జాబితా నుంచి తొలగించి గ్రామంలో నివాసంలేని ఇతర ప్రాంతాల వారి పేర్లను జాబితాలో చేర్చారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. అర్హులందరికీ పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అనంతపురం జిల్లాలోని చిత్రావతి జలాశయం ముంపు పరిహార జాబితాలో అనర్హులకు చోటు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ముదిగుబ్బ మండలం రాఘవపల్లి వాసులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం ఆర్​అండ్​బీ అతిథి గృహం వద్ద పరిపాలనాధికారిని కలిసి వారి సమస్యలను వివరించారు.

ముదిగుబ్బ రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన 20 మంది పేర్లు జాబితా నుంచి తొలగించి గ్రామంలో నివాసంలేని ఇతర ప్రాంతాల వారి పేర్లను జాబితాలో చేర్చారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. అర్హులందరికీ పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

మనోళ్లు.. మళ్లీ సత్తా చాటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.