కళ్యాణదుర్గం బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ, ఐకాస సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో శెట్టూరు నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ద్విచక్రవాహన ర్యాలీను పోలీసులు అడ్డుకొని ఉమామహేశ్వర్ను అరెస్టు చేయటంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. 3 రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కలసి నడుద్దాం అమరావతిని కాపాడుకుందాం